యాప్నగరం

ఓటేశాకే అత్తారింటికి వెళ్లిన పెళ్లి కూతురు

కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ వెంటనే సమీపంలోని పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న..

TNN 19 Feb 2017, 5:40 pm
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ వెంటనే సమీపంలోని పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న ఘటన ఇది. ప్రస్తుతం 3వ విడత పోలింగ్ జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నవ్ ఇందుకు వేదికైంది. ఉన్నవ్‌కి చెందిన సారికకి ఇవాళే వివాహమైంది. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఇంకా పెళ్లి తంతు పూర్తి కాకముందే భర్త రాజేంద్ర శుక్లాతో కలిసి పోలింగ్ బూత్‌కి వెళ్లిన సారిక అక్కడ క్యూలైన్‌లో నిలుచుని మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Samayam Telugu bride casted her vote at unnao in uttar pradesh
ఓటేశాకే అత్తారింటికి వెళ్లిన పెళ్లి కూతురు


పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లే ముందు తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆమె సామాజిక స్పృహ అభినందనీయం అనే చెప్పుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.