యాప్నగరం

బీటెక్ చదివి దొడ్లు కడుగుతామంటున్నారు

దేశంలో దొడ్లు కడిగే కాంట్రాక్ట్ పారిశుధ్య ఉద్యోగానికి కూడా బీటెక్ గ్రాడ్యుయేట్లు పోటీపడుతున్నారు.

TNN 13 Dec 2016, 12:20 pm
ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (ఎఎంసి)లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల భర్తీకి ఇటీవల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా దానికి లక్షకు పైగా దరఖాస్తులు వెళ్లాయి. ఆ పోస్టులకు కనీస విద్యార్హత ఏడవ తరగతి కాగా, దరఖాస్తుదారుల్లో సగానికి సగం మంది డిగ్రీ ఉత్తీర్ణులు. ఇంకా విస్తుగొలిపే విషయమేమిటంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో పాటు మేనేజ్మెంట్ కోర్సులు (ఎంబీఏ) చేసిన వారు కూడా వేల సంఖ్యలో ఉండటం. అలహాబాద్ మునిసిపాలిటీలో సఫాయి కర్మచారి (పారిశుద్ధ్య కార్మికులు) పోస్టులు కేవలం 119 మాత్రమే ఉన్నాయి. కానీ, వాటికి లక్షకు పైగా దరఖాస్తులు రావడం అందులో ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉండటం చూసిన అధికారులు అవాక్కయ్యారు.
Samayam Telugu btech and mbas line up for sweeper jobs in up
బీటెక్ చదివి దొడ్లు కడుగుతామంటున్నారు


మిగిలిన ఉద్యోగాలకు మాదిరిగానే ఈ పోస్టులకు కూడా అభ్యర్ధులకు ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. ఈ ప్రాక్టికల్ పరీక్షలో చీపురు పట్టుకుని మరుగుదొడ్లను కడిగేందుకు కూడా ఉన్నత విద్యావంతులు సై అంటున్నారంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రజలు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.