యాప్నగరం

కేన్సర్ యువతిపై గ్యాంగ్‌రేప్.. సహాయం చేస్తానని మరొకడు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మృగాళ్లు మరోసారి పంజా విసిరారు. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోన్న ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

TNN 10 Dec 2017, 5:30 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లో మృగాళ్లు మరోసారి పంజా విసిరారు. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోన్న ఓ పదహారేళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు అక్కడ నుంచి తప్పించుకున్న ఆమెపై మరో వ్యక్తి సహాయం చేస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. ఈ ఘటన లక్నోలోని సరోజినీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఆదివారం ఉదయం సరుకులు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంతలో అదే ప్రాంతానికి చెందిన శుభం అనే వ్యక్తి, అతడి స్నేహితుడు సుమిత్‌లు ఆమెను అడ్డగించి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
Samayam Telugu cancer patient gang raped seeks help from commuter who rapes her again
కేన్సర్ యువతిపై గ్యాంగ్‌రేప్.. సహాయం చేస్తానని మరొకడు!


అక్కడ నుంచి తప్పించుకున్న బాధితురాలికి సహాయం చేస్తానని చెప్పి నమ్మించి, మరో కామాంధుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమెను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి, పైశాచికత్వానికి పాల్పడిన వ్యక్తిని బంతారాకు చెందిన వీరేంద్ర యాదవ్‌గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులు శుభం, సుమిత్, వీరేంద్ర యాదవ్‌లను అరెస్ట్ చేసినట్లు లక్నో ఈస్ట్ ఏఎస్పీ శ్రావేశ్ మిశ్రా తెలిపారు. దీనిపై దర్యాప్తు మరింత ముమ్మరం చేశామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. డిసెంబరు 3 న కూడా హమీర్‌పూర్ ప్రాంతంలో 17 ఏళ్ల యువతిని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.