యాప్నగరం

పత్తి చేలల్లో గంజాయి వనం, జోరుగా వ్యాపారం

ముంబై గంజాయి ముఠా తెలంగాణలో ఎంటరయ్యింది. ఇక్కడి అమాయక రైతులకు డబ్బు ఆశజూపి..

Samayam Telugu 12 Dec 2016, 2:24 pm
ముంబై గంజాయి ముఠా తెలంగాణలో ఎంటరయ్యింది. ఇక్కడి అమాయక రైతులకు డబ్బు ఆశజూపి..నిషేదిత గంజాయిని పెంచేలా ప్రొత్సహిస్తున్నారు. దీంతో రైతుల తమ పంటపొలాల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తూ తమకు తెలియకుండానే ఉచ్చులో చిక్కుకుంటున్నారు. బయటికి కనిపించకుండా రైతులు పత్తి పొలాల్లో గంజాయి సాగు చేస్తున్నారు.
Samayam Telugu cannabis is being harvested in telangana under cotton crop
పత్తి చేలల్లో గంజాయి వనం, జోరుగా వ్యాపారం


తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బంట్వారం గ్రామంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. మహారాష్ట్రలోని లాథూర్ ప్రాంతానికి చెందిన గంజాయి ముఠా ఇక్కడి రైతుల పంట పొలాల్లో గంజాయి పండిస్తున్నాయి. చేతికొచ్చిన గంజాయి మొక్కలు కిలోకు రూ.2000 వేలు రైతులకు చెల్లించి...దాన్ని ముఠా కిలో మొక్కలను రూ.7లకు గంజాయి బారిన పడ్డవారికి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్రామంలో 41 గంజాయి మొక్కల (20కిలోల విలువ)ను స్వాధీనం చేసుకున్నారు.

బంట్వారంలో ఈ దందా గత రెండేళ్లుగా యధేచ్చగా కొనసాగుతుండటం విశేషం. ఈ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి తన 12 ఎకరాల పత్తి చేనులో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు పంటపొలాల్లో గంజాయి సాగుపై దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలుసుకున్న రైతులు..తమ చేలల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను తొలగించారు.

ముంబై, లాథూర్ వంటి ప్రాంతాల్లో గంజాయి కొనుగోలుకు ముఠాలున్నాయని రైతులు చెబుతున్నారు. వికారాబాద్ లో గంజాయి విక్రయ కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.