ఓ వ్యక్తి ప్రధానమంత్రి మోడీ ఫోటోని అసభ్యంగా పోస్టు చేసి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ముజఫర్ నగర్ లో జరిగింది. ఓ వ్యక్తి తన వాట్సాప్ గ్రూప్ లో మోడీ ఫోటోని మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి... ఆ ఫోటోని పోస్టు చేశాడు. అది ఓ బీజేపీ కార్యకర్త కంటపడింది. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోటోను పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు ఫోటో పోస్టు చేసిన వ్యక్తి గురించి వెతికి పట్టుకుని కేసు నమోదు చేశారు. అందుకే సోషల్ మీడియాలో పోస్టులు చేసే ముందు ఎలాంటి వివాదాస్పదం కాకుండా ఉండేట్టు వంటివే పోస్టు చేయడం మంచిది.
మోడీ ఫోటో అసభ్యంగా పెట్టడంతో...
ఓ వ్యక్తి ప్రధానమంత్రి మోడీ ఫోటోని అసభ్యంగా పోస్టు చేసి కటకటాల పాలయ్యాడు.
TNN 25 Oct 2016, 7:03 pm