యాప్నగరం

సెల్ఫీ కోసం రైలెక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకొని

సెల్ఫీ పిచ్చితో రైలు ఎక్కిన ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. విద్యుత్ వైర్లు తగలడంతో..

TNN 27 Aug 2017, 3:01 pm
సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. సెల్ఫీ దిగడం కోసం 18 ఏళ్ల యువకుడు రైలు పైకి ఎక్కాడు. విద్యుత్ వైర్లు తలగడంతో.. అతడి శరీరం తీవ్రంగా కాలిపోయింది. దీంతో అతణ్ని వెంటనే కిలపౌక్ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు తంబరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయాలపాలైన ఆ యువకుణ్ని దిలీపన్‌గా గుర్తించామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు.
Samayam Telugu chennai boy attempts selfie atop train suffers burns from live wire
సెల్ఫీ కోసం రైలెక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకొని


విద్యుత్ వైరు తగలడంతో దిలీపన్ శరీరం 30-40 శాతం మేర కాలిపోయింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని రైల్వే సిబ్బంది తెలిపారు. తంబరంలోని కొత్త కోచింగ్ టెర్మినల్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. గాయపడిన దీలిపన్ రైల్వే ఉద్యోగి కుమారుడే కావడం గమనార్హం. అతడి తండ్రి మరియప్పన్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. అక్కడికి సమీపంలోని క్వార్టర్స్‌లోనే వారు నివాసం ఉంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.