యాప్నగరం

ఖాకీలే అత్యాచారాలకు తెగబడి 16 మందిపై..

ఛత్తీస్‌ఘడ్‌లో రెండేళ్ల కిందట 16మంది మహిళలపై పోలీసులు అత్యాచారాలకు పాల్పడినట్లు కేంద్ర మానవహక్కుల కమిషన్‌ పేర్కొంది.

TNN 8 Jan 2017, 11:23 am
ఛత్తీస్‌ఘడ్‌లో రెండేళ్ల కిందట 16మంది మహిళలపై పోలీసులు అత్యాచారాలకు పాల్పడినట్లు కేంద్ర మానవహక్కుల కమిషన్‌ పేర్కొంది. బిజాపుర జిల్లాలో 2015 అక్టోబరులో పోలీసులు అత్యాచారలకు పాల్పడినట్లు శనివారం ఎన్‌హెచ్‌ఆర్సీ విడుదల చేసిన నివేదకలో తెలిపింది. ఈ అంశంపై చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. 2015లో చోటు చేసుకున్న ఈ ఘటనపై మరో 20 మంది బాధితుల వాగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని తెలిపింది.
Samayam Telugu chhattisgarh police raped and assaulted 16 women nhrc
ఖాకీలే అత్యాచారాలకు తెగబడి 16 మందిపై..


దీనికి సంబంధించిన వాంగూల్మాలను నెలలోపు నమోదు చేయాలని అధికారులను హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. బాధితులకు పారిహారం కింద రూ.37లక్షల ఎందుకు చెల్లించకూడదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేంద్ర మానవ హక్కుల సంస్థ పేర్కొంది. అత్యాచార బాధితులకు రూ.3లక్షలు, లైంగిక వేధింపులకు గురైన వారికి రూ.2లక్షలు, భౌతిక దాడులకు గురైనవారికి రూ.50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక 2015 నవంబరు 2 న ప్రచురించిన కథనంపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీన్ని సుమోటాగా స్వీకరించింది. దీనిపై 2016 ఫిబ్రవరి 22 న దర్యాప్తు చేపట్టింది. బిజపుర జిల్లాలోని పెగడపల్లి, చిన్నగెల్లూరు, పెద్దగెల్లూరు, గుండం, బుర్గిచేరు గ్రామాల్లోని 40 మంది మహిళలపై పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. పెదగెల్లూరులో నలుగురు మహిళలపై అత్యాచారం చేశారని, ఇందులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూడా ఉందని గ్రామస్థులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.