యాప్నగరం

తల్లి అంత్యక్రియల కోసం పిల్లలు భిక్షాటన

తల్లి అంత్యక్రియల కోసం హాస్పిటల్ ఆవరణలో పిల్లలు బిచ్చమెత్తుకునే హృద‌య‌విదార‌క‌మైన‌ ఘటన ఒకటి చోటుచేసుకుంది.

TNN 8 Feb 2018, 3:55 pm
తల్లి అంత్యక్రియల కోసం హాస్పిటల్ ఆవరణలో పిల్లలు బిచ్చమెత్తుకునే హృద‌య‌విదార‌క‌మైన‌ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. రొమ్ము కేన్సర్‌తో చికిత్స పొందుతూ మృతిచెందిన ఓ మాతృమూర్తి అంతిమ సంస్కారాలకు ఆమె ఇద్దరు కొడుకులూ యాచికులుగా మారడం అక్కడ వారిని కలచివేసింది. దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రొమ్ము కేన్సర్‌తో విజయ (40) అనే మహిళ బుధవారం ప్రాణాలు విడిచింది. తొమ్మిదేళ్ల కిందటే తన భర్త అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారింది. కుటుంబ భారం మొత్తంపై పడటంతో పొలం పనులు చేస్తూ తన ముగ్గురు పిల్లల్ని పోషించేది. ఈ క్రమంలోనే విజయ కొద్ది నెలల కిందట ఆరోగ్యం చెడిపోవడంతో వైద్యులను సంప్రదించింది. ఆమెకు రొమ్ము కేన్సర్ సోకినట్లు నిర్దరణకావడంతో మంచానికే పరిమితమైంది. కేన్సర్‌తో మంచానపడ్డ ఆమెను ఆదుకోవడానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.
Samayam Telugu childrens begging in hospital for their mothers funeral
తల్లి అంత్యక్రియల కోసం పిల్లలు భిక్షాటన


మరోవైపు తన కుమార్తెను ఒట్టానుఛత్రామ్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించింది. కుమారులు మోహన్ (14), వేలుమురుగన్‌ (13) లను ఆమెతోపాటు ఉంటున్నారు. పక్కంటివారి సాయంతో విజయను ఇటీవలే వైద్యం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఇద్దరు బాలురు చేర్పించారు. వ్యాధి తీవ్రంకావడంతో బుధవారం ఆమె కన్నుమూశారు. తల్లి మరణవార్తను విని ఆ పిల్లలు నిశ్చేష్ఠులయ్యారు. తల్లి అంత్యక్రియలకు చిల్లిగవ్వ కూడా చేతిలో లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఆస్పత్రి ఆవరణలోనే బిచ్చమెత్తుకున్నారు. వారి దయనీనస్థితికి జాలిపడిన కొందరు తమకు చేతనైనంత సాయం అందించారు. ఈ విషయం హాస్పిటల్ వెల్ఫేర్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ మాలతీ ప్రకాశ్‌కు తెలియడంతో ఆమె స్పందించారు. ఆ పిల్లలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన డైరెక్టర్ మాలతి, అంత్యక్రియలకు ఏర్పాట్లుచేయించారు.

Read This Story in Tamil

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.