యాప్నగరం

ఆ యాంకర్ లైవ్‌లోనే ఏడ్చేసింది

ఎంతటి భయంకరమైన వార్త అయినా, కంటతడి పెట్టించే వార్త అయినా ఏ ఎమోషన్‌కు గురికాకుండా చదవాలి. కానీ గుండెలు పిండేసే ఓ వార్తకు న్యూస్ రీడర్ కన్నీళ్లు పెట్టుకుంది.

TNN 20 Aug 2016, 11:05 am
ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు యాంకర్లు చెప్పాలి. అది ఎంతటి భయంకరమైన వార్త అయినా, కంటతడి పెట్టించే వార్త అయినా ఏ ఎమోషన్‌కు గురికాకుండా చదవాలి. కానీ గుండెలు పిండేసే ఓ వార్తకు న్యూస్ రీడర్ కన్నీళ్లు పెట్టుకుంది. నిబంధనలు పక్కనబెట్టి బావోధ్వేగంతో ఆ వార్తను చదివింది. సిరియా బాంబు దాడుల నుంచి రక్తమోడుతూ ప్రాణాలతో భయటపడినా ఓమ్రాన్ దక్నీష్‌ ఓ ఆంబులెన్సులో చికిత్స పొందుతున్న దృశ్యాలు ప్రపంచాన్ని కంటతడి పెట్టింది. ఆ వార్తను చదువుతున్న సీఎన్ఎన్ యాంకర్ కేట్ బోల్డన్ కూడా ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపులేక లైవ్ (లైవ్ బులెటిన్)లోనే ఏడ్చేసింది. ఓమ్రాన్ గురించి చెబుతున్న మనం చూస్తే ఏడుస్తాం కానీ, ఇక్కడ గాయాలతో బాధపడుతున్న ఓమ్రాన్ ఏడ్వడం లేదు. అతడు పూర్తిగా షాక్ లో ఉన్నాడు.’ అంటూ గద్గద స్వరంతో మాట్లాడింది. ఆ బాంబు దాడిలో ముగ్గురు చనిపోయారని చెప్పింది. ‘ఓమ్రాన్ బతికాడు. ఇది మీరూ తెలుసుకోవాలనుకుంటున్నాం’ అంటూ ఏడ్చేసింది. అలెప్పోలో జరిగిన బాంబు దాడిలో ఇప్పటిదాకా మొత్తం 4500దాకా చనిపోయారని రిపోర్ట్ చేసింది.
Samayam Telugu cnn achor cries while reporting on syrian boy
ఆ యాంకర్ లైవ్‌లోనే ఏడ్చేసింది


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.