యాప్నగరం

మాజీ ఎంపీ రాజయ్య డ్యాన్స్.. రచ్చ రచ్చ!

కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు డ్యాన్సులు చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే సుదీర్ఘ విరామం తరవాత రాజయ్య మళ్లీ ప్రజల మధ్యకు వచ్చారు.

TNN 2 Jan 2018, 10:40 am
కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు డ్యాన్సులు చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే సుదీర్ఘ విరామం తరవాత రాజయ్య మళ్లీ ప్రజల మధ్యకు వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న రాజయ్య.. రాష్ట్ర విభజన తర్వాత తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరంగల్‌లో రాజయ్య హవా తగ్గిపోయింది. దీనికి తోడు కోడలు సారిక, ముగ్గురు మనువల అనుమానాస్పద మృతి కేసులో రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ కొన్నాళ్లపాటు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆ తరవాత బెయిల్‌పై బయటకు వచ్చిన రాజయ్య.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వరంగల్ క్లబ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. సన్నిహితులతో కలసి సరదాగా డ్యాన్స్ చేశారు.
Samayam Telugu congress former mp siricilla rajaiah dance show on new year eve
మాజీ ఎంపీ రాజయ్య డ్యాన్స్.. రచ్చ రచ్చ!


దీన్ని డ్యాన్స్ చేశారు అనే కన్నా.. రచ్చ రచ్చ చేశారు అంటే బెటర్. చాలా కాలం తరవాత రాజయ్య తన విశ్వరూపాన్ని చూపించారు. పాటకు తగ్గట్లుగా తనదైన స్టైల్లో స్టెప్పులు వేసిన రాజయ్య.. హావభావాలను అద్భుతంగా పలికించారు. రాజయ్య డ్యాన్స్‌ను వీడియో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. ముఖ్యంగా ‘మైసమ్మా’ పాటకు రాజయ్య హావభావాలు కిర్రాక్ అనే చెప్పాలి. నాలుక బయటపెట్టి ఆయన ఇచ్చిన హావభావాలను వీడియో చూసినవాళ్లు మరిచిపోలేరు. మొత్తానికి చాన్నాళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న రాజయ్య.. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మరోసారి దగ్గరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.