పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా లొంగదీసుకోవడమే కాదు ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకొని ప్లేటు ఫిరాయించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన హారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బారామతికి చెందిన అమిత్ జాదవ్ ఉద్యోగ రీత్యా పుణేలో ఉంటున్నాడు. గతేడాది ఏప్రిల్లో మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్లో తాను సాప్ట్వేర్ ఇంజనీర్ అంటూ ప్రకటన ఇచ్చాడు. ఆన్లైన్లో వివరాలను చూసిన పుణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి అమిత్ను సంప్రదించింది. ఇద్దరికి నచ్చడంతో మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని తరచూ మాట్లాడుకునే వారు.
ఒకరోజు తాను సంస్థ తరఫున రెండేళ్ల పాటు విదేశాలకు వెళుతున్నానని, ఈలోగా నిశ్చితార్థం చేసుకుందామని ఆ యువతికి తెలిపాడు. ఆ తర్వాత ఆమెను రావత్లోని తన ఫ్లాటుకు పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. వీసా కోసమంటూ ఆ యువతి దగ్గర డబ్బు తీసుకున్నాడు. రెండు నెలల గడిచాక బాధితురాలిని వివాహం చేసుకోనని అమిత్ చెప్పాడు. అయితే తన దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వమని ఆమె అడిగితే ఇవ్వడానికి నిరాకరించాడు.
దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరో యువతితో కలిసి ఉన్న సందర్భంలో అమిత్ను పుణే రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఆ యువతిని పోలీసులు ప్రశ్నిస్తే అతడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరించింది. గతంలో నిందితుడు ఇలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో నలుగురు యువతులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు ఉద్యోగి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఒకరోజు తాను సంస్థ తరఫున రెండేళ్ల పాటు విదేశాలకు వెళుతున్నానని, ఈలోగా నిశ్చితార్థం చేసుకుందామని ఆ యువతికి తెలిపాడు. ఆ తర్వాత ఆమెను రావత్లోని తన ఫ్లాటుకు పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. వీసా కోసమంటూ ఆ యువతి దగ్గర డబ్బు తీసుకున్నాడు. రెండు నెలల గడిచాక బాధితురాలిని వివాహం చేసుకోనని అమిత్ చెప్పాడు. అయితే తన దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వమని ఆమె అడిగితే ఇవ్వడానికి నిరాకరించాడు.
దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరో యువతితో కలిసి ఉన్న సందర్భంలో అమిత్ను పుణే రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఆ యువతిని పోలీసులు ప్రశ్నిస్తే అతడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరించింది. గతంలో నిందితుడు ఇలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో నలుగురు యువతులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు ఉద్యోగి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.