యాప్నగరం

ఈ రైతు మార్కెట్లు కాస్త ఊరట కలిగిస్తాయా?

రైతులను దేశానికి వెన్నెముకగా చెబుతారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా రైతుల నుంచి లబ్ధి పొందడానికి గొప్పలు చెబుతుంది కానీ..

TNN 6 Apr 2017, 8:15 pm
రైతులను దేశానికి వెన్నెముకగా చెబుతారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా రైతుల నుంచి లబ్ధి పొందడానికి గొప్పలు చెబుతుంది కానీ, వాస్తవానికి వాళ్లకు చేసేది చాలా తక్కువ. ఎండనకా, వాననకా.. ఆరుగాలం కష్టించి పనిచేసి కూడా.. ఒక రైతు తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించుకోలేని దౌర్భాగ్యం. కనీసం వారికి మెరుగైన మార్కెట్ వసతులు కూడా ఉండవు. అలాంటి రైతులకు ఉడతా భక్తిగా.. సాయం అందించడానికి పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఓ నిర్ణయం తీసుకోనుంది. వారాంతాల్లో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా.. తగిన ప్రదేశాలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కార్పొరేటర్లు ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై పీఎంసీ కసరత్తు చేస్తోంది. కొన్ని కాలనీల్లో ప్రజల సహకారంతో ఇలాంటి మార్కెట్లు ఇప్పటికే విజయవంతమైన ఉదంతాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం.. సక్సెస్‌ఫుల్ అయిన విషయం తెలిసిందే.
Samayam Telugu could farmers markets take on agrarian crisis
ఈ రైతు మార్కెట్లు కాస్త ఊరట కలిగిస్తాయా?


ఈ నిర్ణయం వాస్తవ రూపం దాల్చితే.. రైతులు తమ ఉత్పత్తులను తామే అమ్ముకోడానికి ఒక సరైన వేదిక లభించినట్లవుతుంది. తద్వారా వారికి దళారుల బారి నుంచి బయటపడి, కాస్త లాభాలు గడించే అవకాశం దక్కుతుంది. ఇప్పటికే.. సరైన దిగుబడి లేక, వచ్చిన దిగుబడికి కనీస మద్దతు ధర లభించక, అకారణ వర్షాలు, వడగండ్లు తదితర వాతావరణ అననుకూలతల వల్ల కుంగిపోతున్న వ్యవసాయదార్లకు ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగించేదే. దీనికి ప్రజల మద్దతు కూడా తోడైతే.. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అమలుచేసే వెసులుబాటు కలుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.