యాప్నగరం

గుట్కా ఇవ్వలేదని పాన్‌షాప్ యజమానిపై హత్యాయత్నం!

గుట్కా, బీడీలు అరువు ఇవ్వటానికి నిరాకరించాడని పాన్ షాప్ యజమానిపై ఓ కస్టమర్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

TNN 4 Jan 2017, 3:33 pm
గుట్కా, బీడీలు అరువు ఇవ్వటానికి నిరాకరించాడని పాన్ షాప్ యజమానిపై ఓ కస్టమర్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ముంబయిలోని పంత్ నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా పాన్‌షాప్ నడిపే మనోజ్ చౌరాసియాపై ఓ పళ్ల రసాల దుకాణంలో పనిచేసే నరేశ్ కెనీ అనే వ్యక్తి దాడి చేశాడు. నరేశ్ తరచూ మనోజ్ దగ్గర గుట్కా, బీడీలు కొనుగోలు చేస్తుంటాడు. ఎప్పటి లాగే మంగళవారం ఉదయం కూడా పాన్‌షాప్‌ దగ్గరకు వచ్చి గుట్కా, బీడీలు కావాలని, డబ్బులు తర్వాత చెల్లిస్తానని మనోజ్‌తో చెప్పాడు.
Samayam Telugu customer slashes paan sellers throat in busy pant nagar
గుట్కా ఇవ్వలేదని పాన్‌షాప్ యజమానిపై హత్యాయత్నం!


దీనికి మనోజ్ అంగీకరించకపోవడంతో తాను పనిచేసే జ్యూస్ స్టాల్ దగ్గర చెరుకు గడలను కోయడానికి ఉపయోగించే కత్తిని తీసుకెళ్లి అతడిపై దాడికి యత్నించాడు. దీన్ని గమనించిన కొంత మంది అతడి నుంచి మనోజ్‌ను రక్షించడానికి ప్రయత్నించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అంబులెన్స్‌లో మనోజ్‌ను రాజ్వాడీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు రాకను గమనించిన నరేశ్ అక్కడ నుంచి పారిపోడానికి ప్రయత్నించాడు.

అయితే పోలీసులు అతడిని వెంబడించి స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం మతానికి చెందిన చౌరాసియా తనను మతం పేరుతో దూషించాడని, అంతే కాకుండా తనపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడని నరేశ్ పోలీసులకు తెలిపాడు.దీనిపై విచారించిన పోలీసులు అతడు చెప్పినవి కట్టుకథగా నిర్ధరించారు. వైద్యం కోసం హాస్పిటల్‌లో చేర్పించిన మనోజ్ మెడ చుట్టూ 21 కుట్లు వేసినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన డీసీపీ రాజేశ్ ప్రధాన్ అనుమతి లేకుండా వీధుల్లో దుకాణాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని బీఎంసీతోపాటు పంత్ నగర్ పోలీసులను కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.