యాప్నగరం

సభలో సడేమియా.. ఎంపీ గారి ఫోన్ చోరీ!

ఏకంగా ఎంపీ గారి మొబైల్ ఫోనే చోరీకి గురైన ఉదంతమిది. పార్లమెంట్‌ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఫోన్‌ను దొంగలు అపహరించారు. ఆదివారం (అక్టోబర్ 29) సాయంత్రం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘స్వదేశీ జాగరణ్‌ మంచ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తివారీ కూడా హాజరయ్యారు.

TNN 31 Oct 2017, 9:55 pm
ఏకంగా ఎంపీ గారి మొబైల్ ఫోనే చోరీకి గురైన ఉదంతమిది. పార్లమెంట్‌ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఫోన్‌ను దొంగలు అపహరించారు. ఆదివారం (అక్టోబర్ 29) సాయంత్రం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘స్వదేశీ జాగరణ్‌ మంచ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చైనా వస్తువులను బహిష్కరించాలనే పిలుపునిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తివారీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగించడానికి పోడియం వద్దకు వెళ్లిన తివారీ.. ఒక్కసారిగా జేబులు తడుముకోవడం ప్రారంభించారు. తివారీ చేష్టలను ఆసక్తిగా గమనించిన జనానికి.. కాసేపటి తర్వాత ఆయన ఫోన్ చోరీకి గురైందన్న సంగతి అర్థమైంది.
Samayam Telugu delhi bjp chief manoj tiwaris iphone goes missing at rally against chinese goods
సభలో సడేమియా.. ఎంపీ గారి ఫోన్ చోరీ!


ఎంత వెతికినా తన ఐ-ఫోన్‌ కనిపించకపోవడంతో తివారీ నిరాశ చెందారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేల సంఖ్యలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్న సభలో.. అదను చూసి దొంగలు తమ చేతులకు పని చెప్పారన్నమాట. ఇదే కార్యక్రమంలో తివారీ వ్యక్తిగత సెక్యూరిటీ వాలెట్‌, షూ కూడా చోరీకి గురవ్వడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.