యాప్నగరం

విటుడిగా వెళ్లి వేశ్యను ప్రేమించాడు!

చార్మి కథానాయికగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' సినిమా గుర్తుందా? వేశ్యవృత్తిలో ఉన్న జ్యోతిలక్ష్మిని ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడటం, ఆమెను ఒప్పించి తీసుకెళ్లిపోవడం, పెళ్లి చేసుకోవడం ఇది ఆ సినిమా కథ.

TNN 7 Jul 2017, 11:48 am
చార్మి కథానాయికగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' సినిమా గుర్తుందా? వేశ్యవృత్తిలో ఉన్న జ్యోతిలక్ష్మిని ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడటం, ఆమెను ఒప్పించి తీసుకెళ్లిపోవడం, పెళ్లి చేసుకోవడం ఇది ఆ సినిమా కథ. అచ్చ ఆ సినిమాలోలానే న్యూఢిల్లీలోని వేశ్యావాటికలో సంఘటన జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ చొరవతో ఈ కథ సుఖాంతమయ్యింది. ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసే ఓ 28 ఏళ్ల యువకుడు రెండేళ్ల కిందట గారిస్టన్ బాస్టిన్ రోడ్డులోని ఓ వేశ్యావాటికకు వెళ్లాడు. ఉపాధి కోసం నేపాల్ నుంచి ఇండియాకు వచ్చిన ఆ యువతి వేశ్యగా మారిన 27 ఏళ్ల యువతిని కలిశాడు. విటుడిగా వెళ్లినప్పటికీ, తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు.
Samayam Telugu delhi commission for women rescues sex worker from brothel of gb road
విటుడిగా వెళ్లి వేశ్యను ప్రేమించాడు!


ఆమెపై ఇష్టంతో తరచూ అక్కడకు వెళ్లేవాడు. తన ప్రేమ విషయం తెలియజేయడంతో ఆమె కూడా అంగీకారం తెలిపింది. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న యువకుడు తమకు సాయం చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాడు. చైర్మన్ స్వాతి మలివాల్ పోలీసుల సాయంతో దాడులు చేసి ఆమెకు విముక్తిని కల్పించారు. అతి త్వరలో వీరిద్దరికీ వివాహం జరిపించనున్నామని స్వాతి మలివాల్ ప్రకటించారు. జీబీ రోడ్డులోని ఇరుకు గదులలో సాగుతున్న వ్యభిచార దందాలను అడ్డుకునేందుకు మరిన్ని దాడులు చేయనున్నామని అన్నారు. మహిళలను అక్రమంగా తరలించే వ్యభిచార ముఠాల ఆటకట్టిస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.