యాప్నగరం

ఆసుపత్రి నిర్లక్ష్యం: అంత్యక్రియల్లో కదిలిన శిశువు..

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అయిన మరో ఉదంతం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను గురువారం (నవంబర్ 30) స్థానిక మ్యాక్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

TNN 1 Dec 2017, 6:08 pm
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అయిన మరో ఉదంతం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను గురువారం (నవంబర్ 30) స్థానిక మ్యాక్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొంత సేపటి తర్వాత ఆమెకు సర్జరీ చేసిన వైద్యులు కవలలు పుట్టారని చెప్పారు. అయితే.. అందులో ఒక ఆడ శిశువు గర్భంలోనే మరణించిందని, మగ శిశువు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వివరించారు. ఆ శిశువు ప్రాణాలు దక్కాలంటే మూడు నెలల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని, దానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ కుటుంబం దీని గురించి ఆలోచిస్తుండగానే.. ఆ మగ శిశువు కూడా మరణించిందని చేదు వార్త చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది శిశువుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచి ఆ కుటుంబానికి అప్పగించారు.
Samayam Telugu delhi hospital declares newborn dead family finds him alive before cremation
ఆసుపత్రి నిర్లక్ష్యం: అంత్యక్రియల్లో కదిలిన శిశువు..


తీవ్ర నిరాశతో ఆ కుటుంబం మృతదేహాలను తీసుకొని అంత్యక్రియల కోసం బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో ఓ కవర్లోని శిశువు కదిలినట్లు అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి పరుగెత్తారు. ఆ మగ శిశువు ప్రాణాలతోనే ఉందని, ఆరోగ్యం కూడా పర్వాలేదని వైద్యులు చెప్పడంతో అప్పటిదాకా తీవ్ర నైరాశ్యంతో కూరుకుపోయిన వారి మొహాలు వేల కాంతులతో వెలిగిపోయాయి. వాళ్ల పిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మ్యాక్స్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.