యాప్నగరం

నోట్ల రద్దు: ATMలపై ఎటాక్, అంత్యక్రియలు

నోట్ల రద్దుతో సామాన్యుల సహనం నశిస్తోంది. ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే నగదు రూ.2వేలకు కుదించడం...

Samayam Telugu 21 Nov 2016, 10:23 am
నోట్ల రద్దుతో సామాన్యుల సహనం నశిస్తోంది. ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే నగదు రూ.2వేలకు కుదించడం...అంత తక్కువ అమౌంట్ కూడా అన్ని ఏటీఎంలలో సరిపడా లేకపోవడంతో....జనం అర్థరాత్రి అపరాత్రి అంటూ తేడా లేకుండా వాటి దగ్గర నిద్రపోతున్నారు.
Samayam Telugu demonetisation atms attacked funeral conducted in tn
నోట్ల రద్దు: ATMలపై ఎటాక్, అంత్యక్రియలు


శనివారం మధ్యాహ్నానికే దేశంలోని మెజార్టీ ఏటీఎంల ఖాళీ అయిపోయాయి. అరకొర ఏటీఎంలలో ఉన్న డబ్బు ఆదివారం నిల్ కావడంతో...జనం ఆగ్రహాంతో ఊగిపోయారు.

చైన్నై-మైలాపూర్ లజ్ కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకుల ఏటీఎంలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటీఎంలలో డబ్బు రాకపోవడంతోనే ఇక్కడి మూడు ఏటీఎంలపై డాచి చేసి ఉంటారని బ్యాంకు సిబ్బంది భావిస్తున్నారు. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలు కూడా పనిచేయడం లేదు.

అటు కోయంబత్తూరులో ఏటీఎంలన్నీ ఖాళీకావడంతో..ఏటీఎం సెంటర్లకు పూల దండలు వేసి..అంత్యక్రియలు నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దగ్గరివాళ్లు చనిపోతే ఎలా విలపిస్తారో అలాగే ఏటీఎంల వద్ద ఏడ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.