యాప్నగరం

ఆసుపత్రిలోనే డాక్టర్ అత్యాచారయత్నం

బాలిక నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో బాలిక తీవ్ర మనస్థాపానికి గురై మతిస్థిమితం కోల్పోయినట్లు

TNN 13 Mar 2017, 7:48 am
‘వైద్యో నారాయణో హరి’.. మాటలకి మచ్చ తెస్తూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బాలికపై ఓ డాక్టర్ అత్యాచారయత్నం చేశాడు. తూర్పు గోదావరి జిల్లా శ్రీరామ్‌నగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో బాలిక తీవ్ర మనస్థాపానికి గురై మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తుండటంతో కుటుంబ సభ్యులు స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
Samayam Telugu doctor attempts to rape patient
ఆసుపత్రిలోనే డాక్టర్ అత్యాచారయత్నం


గత మంగళవారం ఈఎస్ఐ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ అనుబంధ ఆసుపత్రికి బాలికను తరలించారు. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రామ్‌గోపాల్ రెడ్డి బాలికను పరీక్షించే నెపంతో బంధువుల్ని గది నుంచి వెలుపలకి పంపించాడు. అనంతరం బాలికను బాత్‌రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో వైద్యుడు ఆమెను గాయపరిచాడు. ఇంతలో కాంపౌండర్ తలుపుతీసుకుని గదిలోకి రావడంతో డాక్టర్ దురాగతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో
డాక్టర్‌ని అక్కడే చితకబాది ఆసుపత్రి ఎదుట పెద్దయెత్తున ఆందోళనకు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.