యాప్నగరం

ఆ భారీ మహిళ బరువు తగ్గినా కానీ....

ప్రపంచంలోనే అతి భారీ మహిళ ఈజిప్ట్‌కి చెందిన ఎమన్‌ అహ్మద్‌ రెండు నెలల్లోనే 262 కిలోలకు పైగా బరువు తగ్గింది. అమె ఆరోగ్యం గురించి సైఫీ ఆస్పత్రి వైద్యులు ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తూనే ఉన్నారు.

TNN 16 Apr 2017, 12:56 pm
ప్రపంచంలోనే అతి భారీ మహిళ ఈజిప్ట్‌కి చెందిన ఎమన్‌ అహ్మద్‌ రెండు నెలల్లోనే 262 కిలోలకు పైగా బరువు తగ్గింది. అమె ఆరోగ్యం గురించి సైఫీ ఆస్పత్రి వైద్యులు ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తూనే ఉన్నారు. సగం బరువు తగ్గడంతో తన మొహాన్ని చేత్తో తాకగలుగుతోంది కూడా. కానీ ఎంత బరువు తగ్గినా ఎమన్‌ లేచి నడిచే అవకాశమైతే లేదని ఎమన్‌కి చికిత్స అందిస్తున్న డా.ముఫజల్‌ లక్డావాలా తెలిపారు. ఆమెకు 11 ఏళ్ల వయసులో పక్షవాతం రావడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. 25 ఏళ్లు వచ్చేటప్పటికి విపరీతంగా బరువుపెరగడంతో పరిస్థితి ఇంకా తీవ్రమైంది.
Samayam Telugu egyptian woman eman ahmeds next challenge is neurological rehabilitation
ఆ భారీ మహిళ బరువు తగ్గినా కానీ....


దీంతో ఎమాన్ ఇప్పుడు బరువు తగ్గినా నడవలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక గదిలో చికిత్స పొందుతున్నఆమెను సైఫీ ఆస్పత్రిలోని ప్రధాన భవంతిలోకి మార్చారు. ఎమన్‌కి ఉబకాయానికి సంబంధించిన చికిత్స పూర్తయిందని త్వరలో నరాల బలహీనత చికిత్స చేపడతామని డాక్టర్ ముఫజల్‌ అన్నారు. ప్రపంచంలోనే భారీ కాయురాలిగా పేరు తెచ్చుకున్న ఈజిప్ట్‌కు చెందిన 36 ఏళ్ల ఎమాన్ అహ్మద్. 500 కిలోల బరువుతో కనీసం చేయికూడా కదపలేని పరిస్థితుల్లో ఉండేది. ప్రస్తుతం ఆమె ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో బరువు తగ్గే చికిత్స పొందుతోంది.


డాక్టర్ ముఫజల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమాన్ ఈజిప్టు నుంచి వచ్చే సమయానికి ఉన్న బరువులో దాదాపు 242 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు . మార్చి 7న న జరిగిన గ్యాస్ట్రోక్టమీ శస్త్రచికిత్స ద్వారా ఆమె 130 కిలోలు తగ్గిందని తెలిపారు. నెల రోజుల్లోనే 130 కిలోలు తగ్గడం చాలా శుభ పరిణామమని పేర్కొన్నారు. బరువు తగ్గతుండడంతో ఆమె ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతోందన్నారు. శరీరంలోని ప్రధాన అవయవాల్లో చేరిన నీరు కూడా బయటికి పోతోందన్నారు. గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తుల పనితీరు కూడా ఇప్పుడు అదుపులో ఉన్నాయని తెలిపారు.


చికిత్స పూర్తైన తర్వాత విమానంలో కూర్చుని తిరిగి ఈజిప్టు వెళ్లగలిగే పరిస్థితి వచ్చాకే ఆమెను పంపిస్తామని డాక్టర్ ముఫజల్ చెప్పారు. ఏడాది తర్వాత మరోసారి ఎమాన్‌కు బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి రావొచ్చని వైద్యులు తెలిపారు. తనతో మాట్లాడేవారు లేకపోవడంతో ఎమాన్ ఒంటరిగా ఫీలవుతోందని, దీనికి ప్రధాన అడ్డంకి అరబిక్ ఎవరికీ తెలియకపోవడమే. ఆమె చికిత్స కోసం దేశంలోని వివిధ వర్గాలు వ్యక్తులు రూ.65 లక్షలు విరాళంగా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.