యాప్నగరం

వేశ్యాగృహంలో ప‌ట్టుపడ్డ ఇంజ‌నీరింగ్ విద్యార్థిని

ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ వృత్తిలోకి దించారు. మరింత విస్మయకరమైన

TNN 11 Sep 2017, 2:31 pm
హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడాలో ఒక వేశ్యాగృహంపై పోలీసుల దాడిలో పట్టుబడిన ఒక అమ్మాయి కథ విస్మయాన్ని కలిగించేలా ఉంది. సినిమా అవకాశాలు సంపాదించుకోవాలని కలలు కంటూ, అందుకోసం డబ్బు సంపాదించుకోవడానికి ఆమె ఆ వృత్తి లోకి దిగిందని తెలుస్తోంది. ఈ విషయంలో ఆ వేశ్యాగృహ నిర్వాహకుల పాత్ర కూడా ఉంది. ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ వృత్తిలోకి దించారు. మరింత విస్మయకరమైన అంశం ఏమిటంటే.. ఆ అమ్మాయి ఒక విద్యార్థిని. నగరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది!
Samayam Telugu engineering student arrested in prastitution case
వేశ్యాగృహంలో ప‌ట్టుపడ్డ ఇంజ‌నీరింగ్ విద్యార్థిని


బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి... యూసుఫ్‌గూడాలో నాగభాస్కర్, దుర్గా ప్రసాద్, ధర్మ.. అనే వ్యక్తులు వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఈ రైడ్ లో ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక అమ్మాయి మోడల్. మరో అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని. ఫైనలియర్ చదువుతోంది.

అయితే ఈమెకు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని కోరిక. తనకు అందం ఉంది కాబట్టి, అర్హత ఉంది.. అనుకుంది. అయితే సినిమాల్లో ప్రయత్నాల కోసం తగిన మెయింటెయినెన్స్ కు డబ్బుల అవసరం ఏర్పడింది. ఆమె అవసరాలను తీరుస్తామంటూ నాగభాస్కర్, దుర్గా ప్రసాద్, ధర్మలు పరిచయం అయ్యారు. ఫొటో షూట్ చేయించి.. ఆమె ఫొటోలను విటులకు పంపారు. డబ్బు కావాలంటే తాము చెప్పినట్టుగా చేయాలని.. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించారు.

ఈ నేపథ్యంలో జరిగిన రైడింగ్ లో అంతా పట్టుబట్టారు. పట్టుబడ్డ యువతులను, బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులపై కేసులు పెట్టి అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.