ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ బైక్ అమ్ముతానని పోస్ట్ చేశాడు. కొనేద్దామనుకుంటే ధర ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బైక్ను సొంతం చేసుకోవాలనే ఆలోచన. అదే ఆ ఫ్రెండ్ మరణానికి, ఆ వ్యక్తి జైలుకెళ్లడానికి కారణమైంది. ఇంతకూ ఏం జరిగిందంటే..
సోహన్ హలదర్ కుమార్ అనే యువకుడు బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతడికి కొద్ది నెలల క్రితం కార్తీక్ దౌలత్ అనే 30 ఏళ్ల టెలీ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఫేస్బుక్ ద్వారా ఫ్రెండయ్యాడు. తన దగ్గరున్న రూ.లక్ష విలువైన డ్యూక్ 250 బైకును అమ్ముదామని సోహన్ భావించాడు. దీంతో ఆ బైక్ వివరాలు, ధర, తన అడ్రస్ తదితర వివరాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కార్తీక్ ఆ బైక్ను కొందామని భావించాడు. కానీ ధర ఎక్కువగా ఉండటంతో సోహన్ చంపేసి, బైక్తో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆగష్టు 4న రాత్రి సమయంలో సోహన్ ఫ్లాట్కు వెళ్లిన కార్తీక్ అతడితో కలిసి భోజనం చేశాడు. ఈ క్రమంలో సోహన్ భోజనంలో సైనైడ్ కలిపాడు. విషతుల్యమైన ఆహారం తీసుకున్న సోహన్ వెంటనే కుప్పకూలిపోయాడు. అదే అదనుగా భావించిన కార్తీక్ బైక్తోపాటు సోహన్ క్రెడిట్ కార్డు, డబ్బు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది రోజులుగా సోహన్ ఆఫీస్కు రాకపోవడంతో అతడి ఫ్లాట్కు వెళ్లిన తోటి ఉద్యోగులు అతడి గది నుంచి దుర్వాసన రావడం గమనించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సోహన్ చనిపోయి ఉంటాడని ముందుగా భావించారు. కానీ సోహన్ నాలుక బయటకు రావడం, డెడ్ బాడీ పడి ఉన్న తీరును చూసి అతడి మరణం అసాధారణంగా ఉందని ఎంబీబీఎస్ చదివిన కడుగోడి డీసీపీ భావించాడు. దీంతో ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజీ చూడగా, కార్తీక్పై అనుమానం కలిగింది. దీంతో అతణ్ని తమదైన స్టయిల్లో విచారించే సరికి నేరాన్ని ఒప్పుకున్నాడు.
కార్తీక్ తొలి నుంచి నేరప్రవృత్తి కలవాడేనని పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఓసారి నగల దుకాణం నుంచి చైన్ తీసుకొని పారిపోబోయి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. మరోసారి తన ఫ్రెండ్కు ఫుడ్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి అతడి వద్ద నుంచి ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లాడు. ఇంకోసారైతే ఓ మేనేజ్మెంట్ స్టూడెంట్ వద్ద నుంచి విలువైన వస్తువులు కొట్టేయాలని ప్లాన్ వేసిన అతడు ఆ ఫ్రెండ్ రూంకు రెండు భోజనం పార్శిల్స్ తీసుకెళ్లాడు. ఒకదానిలో మత్తు మందు కలిపాడు. కానీ అతిగా మద్యం సేవించి మత్తు మందు కలిపిన దాన్ని అతడే తినేశాడు. దీంతో ఆసుపత్రి పాలయ్యాడు.
సోహన్ హలదర్ కుమార్ అనే యువకుడు బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతడికి కొద్ది నెలల క్రితం కార్తీక్ దౌలత్ అనే 30 ఏళ్ల టెలీ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఫేస్బుక్ ద్వారా ఫ్రెండయ్యాడు. తన దగ్గరున్న రూ.లక్ష విలువైన డ్యూక్ 250 బైకును అమ్ముదామని సోహన్ భావించాడు. దీంతో ఆ బైక్ వివరాలు, ధర, తన అడ్రస్ తదితర వివరాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కార్తీక్ ఆ బైక్ను కొందామని భావించాడు. కానీ ధర ఎక్కువగా ఉండటంతో సోహన్ చంపేసి, బైక్తో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆగష్టు 4న రాత్రి సమయంలో సోహన్ ఫ్లాట్కు వెళ్లిన కార్తీక్ అతడితో కలిసి భోజనం చేశాడు. ఈ క్రమంలో సోహన్ భోజనంలో సైనైడ్ కలిపాడు. విషతుల్యమైన ఆహారం తీసుకున్న సోహన్ వెంటనే కుప్పకూలిపోయాడు. అదే అదనుగా భావించిన కార్తీక్ బైక్తోపాటు సోహన్ క్రెడిట్ కార్డు, డబ్బు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది రోజులుగా సోహన్ ఆఫీస్కు రాకపోవడంతో అతడి ఫ్లాట్కు వెళ్లిన తోటి ఉద్యోగులు అతడి గది నుంచి దుర్వాసన రావడం గమనించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సోహన్ చనిపోయి ఉంటాడని ముందుగా భావించారు. కానీ సోహన్ నాలుక బయటకు రావడం, డెడ్ బాడీ పడి ఉన్న తీరును చూసి అతడి మరణం అసాధారణంగా ఉందని ఎంబీబీఎస్ చదివిన కడుగోడి డీసీపీ భావించాడు. దీంతో ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజీ చూడగా, కార్తీక్పై అనుమానం కలిగింది. దీంతో అతణ్ని తమదైన స్టయిల్లో విచారించే సరికి నేరాన్ని ఒప్పుకున్నాడు.
కార్తీక్ తొలి నుంచి నేరప్రవృత్తి కలవాడేనని పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఓసారి నగల దుకాణం నుంచి చైన్ తీసుకొని పారిపోబోయి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. మరోసారి తన ఫ్రెండ్కు ఫుడ్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి అతడి వద్ద నుంచి ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లాడు. ఇంకోసారైతే ఓ మేనేజ్మెంట్ స్టూడెంట్ వద్ద నుంచి విలువైన వస్తువులు కొట్టేయాలని ప్లాన్ వేసిన అతడు ఆ ఫ్రెండ్ రూంకు రెండు భోజనం పార్శిల్స్ తీసుకెళ్లాడు. ఒకదానిలో మత్తు మందు కలిపాడు. కానీ అతిగా మద్యం సేవించి మత్తు మందు కలిపిన దాన్ని అతడే తినేశాడు. దీంతో ఆసుపత్రి పాలయ్యాడు.