యాప్నగరం

భార్యకు గుడికట్టి పూజలు చేస్తున్నాడు!

చనిపోయిన భార్యకు ఆలయాన్ని నిర్మించి, దేవతలతోపాటు ఆమెకు పూజలు నిర్వహిస్తున్నాడు. అలాగని ఆయన ధనవంతుడు కూడా కాదు. ఓ సాధారణ రైతు.

TNN 23 Feb 2018, 11:33 am
చనిపోయిన భార్యకు ఆలయాన్ని నిర్మించి, దేవతలతోపాటు ఆమెకు పూజలు నిర్వహిస్తున్నాడు. అలాగని ఆయన ధనవంతుడు కూడా కాదు. ఓ సాధారణ రైతు. ఇది కర్ణాటకకు చెందిన రాజు అలియాస్ రాజుసామి కథ. చామరాజ్‌నగర్ జిల్లాలోని ఎల్లందూర్ తాలూకా కృష్ణపుర గ్రామానికి చెందిన రాజుసామి 2006లోనే ఈ ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాదు భార్య రాజమ్మ విగ్రహాన్ని సైతం ఆయనే తయారుచేయడం విశేషం. 12 ఏళ్ల నుంచి రోజూ ఆమెకు పూజలు నిర్వహిస్తున్నాడు. శనీశ్వర, సిద్దప్పాజీ, నవగ్రహ, శివుడి విగ్రహాలతోపాటు భార్య రూపాన్ని కూడా అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నాడు. తన అక్క కుమార్తెను రాజుసామి వివాహం చేసుకోవడం అతడి తల్లిదండ్రులకు నచ్చలేదు. వారు అభ్యంతరం వ్యక్తంచేసినా మేనకోడలినే వివాహం చేసుకున్నాడు. అయితే అక్కా బావలు మాత్రం దీనికి అంగీకరించారు.
Samayam Telugu farmer builds temple of love worships wife
భార్యకు గుడికట్టి పూజలు చేస్తున్నాడు!


పెళ్లైన కొద్ది రోజుల తర్వాత గ్రామంలో ఓ ఆలయాన్ని నిర్మించమని ఆమె కోరింది. దీంతో భార్య కోరిక మేరకు గ్రామంలో ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. అయితే నిర్మాణం పూర్తయ్యేలోపు ఆమె మృతి చెందింది. అయితే తాను చనిపోతాననే విషయం ఆమెకు ముందే తెలుసని... తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని రాజు అంటున్నాడు. నిరంతరం ఆమె కలలో ఆలయం కనిపించేదని, తను ఓ ఆధ్యాత్మిక శక్తి.. అందుకే మరణం తర్వాత ఆమెను పూజిస్తున్నానని తెలిపాడు. ఆలయ నిర్మాణం పూర్తిచేసి దేవతగా ఆమెనే ప్రతిష్ఠించానని పేర్కొన్నాడు. అంతేకాదు మా ప్రేమ అజరామమైందని వ్యాఖ్యానించారు. రాజుసామి నిర్ణయాన్ని మొదట్లో గ్రామస్థులు వ్యతిరేకించినా తర్వాత మాత్రం సమర్ధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.