కనురెప్ప కాలసర్పమై కాటు వేస్తే తన బాధ ఎవరితో చెప్పుకుంటుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచక తండ్రి కూతురుపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ కామాంధుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పంజాబ్లోని అమృతసర్ నగరంలో ఈ ఘటన జరిగింది. మొదటి భార్య చనిపోవడంతో నిందితుడు బీహార్కు చెందిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆమె తన పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన స్కూల్ టీచర్కు ఈ విషయం తెలిపింది. తండ్రి తనపై రెండుసార్లు అత్యాచారం చేసినట్లు ఏడో తరగతి చదువుతున్న ఆ బాలిక ఉపాధ్యాయురాలికి చెప్పింది. దీంతో ఆమె శిశు సంక్షేమ శాఖ అధికారుల సాయం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి భార్య కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తండ్రి అఘాయిత్యంతో బాలిక షాక్కు గురైందని, పరారీలో ఉన్నఉన్న తండ్రి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఆమె తన పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన స్కూల్ టీచర్కు ఈ విషయం తెలిపింది. తండ్రి తనపై రెండుసార్లు అత్యాచారం చేసినట్లు ఏడో తరగతి చదువుతున్న ఆ బాలిక ఉపాధ్యాయురాలికి చెప్పింది. దీంతో ఆమె శిశు సంక్షేమ శాఖ అధికారుల సాయం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి భార్య కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తండ్రి అఘాయిత్యంతో బాలిక షాక్కు గురైందని, పరారీలో ఉన్నఉన్న తండ్రి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.