యాప్నగరం

ఫేస్‌బుక్ పరిచయం ప్రాణాల మీదకు తెచ్చింది

ఫేస్‌బుక్‌లో అమ్మయిని చూసి, ఆమెతో స్నేహం చేశాడు.

TNN 4 Nov 2016, 4:08 pm
ఫేస్‌బుక్‌లో అమ్మయిని చూసి స్నేహం చేశాడు. చివరికి ఆమె తనతో ప్రేమకి, పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తమిళనాడులోకి కొయంబత్తూరులో జరిగింది. కనగ లక్ష్మీ (21) భారతియర్ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఏడాది క్రితం చెన్నైలో ఉండే వెంబురాజ్ (28) అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. అతను ఆమెతో తరచూ చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ఆమెను నేరుగా చూడకుండానే చాటింగ్ లో ఓసారి తన ప్రేమని వ్యక్తపరిచాడు. కనగ లక్ష్మీ ప్రస్తుతం తన దృష్టి చదువు మీదే ఉందని చెప్పి తిరస్కరించింది. అయినా ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది.
Samayam Telugu fb friend stabs 21 year old girl in coimbatore
ఫేస్‌బుక్ పరిచయం ప్రాణాల మీదకు తెచ్చింది


వెంబురాజ్ ఆమె ఫోన్ నెంబరును సంపాదించి ఫోన్ లో కూడా మెసేజ్ లు పంపడం మొదలుపెట్టాడు. విసిగిపోయిన కనకలక్ష్మీ అతడిని పట్టించుకోవడం మానేసింది. దీంతో ఓసారి వెంబురాజ్ కాలేజీ దగ్గరకు వస్తానని కలవమని అడిగాడు. ఇద్దరూ బస్టాపులో మొదటిసారి కలుసుకున్నారు. అక్కడ కూడా తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆమె తిరస్కరించడంతో కోపం పట్టలేక విరిగిన గాజు బాటిల్ తో ఆమె మెడ కోసేశాడు.

బస్టాపులో ఉన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోపు నిందితుడు పారిపోయాడు. పోలీసులు కనగలక్ష్మిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వేరే బస్టాపులో ఉన్న వెంబురాజ్ ను అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.