యాప్నగరం

వికటించిన విందు... 15 మంది మృతి

వివాహంలో వడ్డించిన ఆహారం వికటించడంతో 15 మంది మృతి చెందిన ఘటన తూర్పుగోదావరిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల కిందట జరిగిన ఓ వివాహ వేడుకలో తిన్న మాంసాహారం విషతుల్యం కావడంతో ఇది జరిగింది.

TNN 25 Jun 2017, 5:41 pm
వివాహంలో వడ్డించిన విందు వికటించడంతో నాలుగు రోజుల్లోనే 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని చాపరాయిలో విందు భోజనం వికటించి 15 మంది మృతి చెందారు. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలో 15 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఓ వివాహ వేడుకలో వడ్డించిన మాసాంహారం వికటించి విషంగా మారడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలియజేశారు. అస్వస్థతకు గురైనవారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ కార్తికేయ మిత్రా ఆదేశించారు. నాలుగు రోజుల్లోనే 15 మరణాలు సంభవించినా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఆ ప్రాంతానికి వైద్యుల బృందాన్ని పంపినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Samayam Telugu fifteen members die of suspected food poision at east godavari
వికటించిన విందు... 15 మంది మృతి


ఇది మారుమూల గిరిజన ప్రాంతం కావడంతో వారికి సరైన వైద్య సదుపాయాలు అందకపోవడమే మరణాలకు దారితీసింది. గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకునే ప్రభుత్వాలను వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి అధికారుల అలసత్వం కూడా ఓ కారణం. అధునాతన సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులోకి వచ్చినా మారుమూల ప్రాంతాల అభివృద్ధి మాత్రం శూన్యం. మరణించిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మరణాలపై పూర్తిస్థాయి సమాచారం మాత్రం అందుబాటులోకి రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.