యాప్నగరం

పొట్టి దుస్తులు... వాటిపై మోడీ బొమ్మ

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ లో కేసు నమోదైంది.

TNN 4 Nov 2016, 7:48 pm
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ లో కేసు నమోదైంది. ఆమె మోడీ ఫోటోలు ఉన్న కురచ దుస్తులు ధరించడాన్ని మోడీ అభిమాని చాలా అవమానంగా భావించారు. దీంతో ఫిర్యాదు చేశారు. ఆగస్టులో అమెరికాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాఖీ సావంత్ హాజరైంది. ఆ రోజున ఆమె ఈ మోడీ బొమ్మలు ఉన్న దుస్తులు ధరించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు రేగాయి. ప్రధాని పరువు తీస్తోందంటూ అనేక మంది దుమ్మెత్తి పోశారు. అయినా ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఏమాత్రం పట్టించుకోలేదు.
Samayam Telugu fir lodged against rakhi sawant for wearing dress with modis photos
పొట్టి దుస్తులు... వాటిపై మోడీ బొమ్మ


ఆ వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ అనుకున్నారు. అయితే గురువారం రాత్రి రాజస్థాన్ లోని కాంక్రోలీకి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు రాఖీపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.