యాప్నగరం

ఆ బావిలోంచి సలసల మరిగే నీళ్లు

ఓ పేదరైతు పొలానికి నీళ్ల కోసం బోరు బావి తవ్వించాడు.

TNN 5 May 2016, 2:36 pm
ఓ పేదరైతు పొలానికి నీళ్ల కోసం బోరు బావి తవ్వించాడు. 30 మీటర్లు తవ్వేసరికి గంగాదేవి ధారాళంగా పైకి చిమ్మింది. ఆ నీటి తడి పేదరైతుని తాకింది. ఆయన ముఖంలో నవ్వు లేదు సరికదా ఆశ్చర్యంతో కళ్లు ఇంతింతలయ్యాయి. ఎందుకో తెలుసా? ఆ నీళ్లు వేడి నీళ్లు. సహజసిద్ధంగా బావిలోనే వేడెక్కి బయటికి వస్తున్నాయి. ఆ నీళ్లు పొలానికి వదిలితే విత్తనం మొలవదు సరికదా... మాడిపోతుంది. అందుకని ఆ నీటిని చల్లార్చి... ఆనక పొలానికి వదులుతున్నాడు ఆ పేద రైతు. ఈ వేడినీళ్ల బావి రాజస్థాన్‌లోని బిచార్డీ గ్రామంలో ఉంది. ఆ నీళ్లు 58డిగ్రీల సెల్సియస్ వేడితో బయటికి వస్తున్నాయి. ఎండాకాలంలోనే కాదు, శీతాకాలంలో కూడా నీటి ఉష్ణోగ్రత అలాగే ఉంటుంది. శాస్త్రీయంగా అలాంటి బావుల్ని ‘జియో థర్మల్ బావులు’ అంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో అలాంటి వేడినీటి బావి ఇదొక్కటే అని అంటున్నారు. భూమి అడుగున ఉన్న మైకా శిలలు రాళ్ల రాపిడి వల్ల నీళ్లు వేడెక్కె అవకాశం ఉందని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ పేద రైతులు ఆ వేడి నీటి బావిని పర్యాటక ప్రాంతంగా మార్చుకుంటే... తమ పేదరికాన్ని దూరం చేసుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు.
Samayam Telugu first in rajasthan rare hot water well found in village near pali
ఆ బావిలోంచి సలసల మరిగే నీళ్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.