యాప్నగరం

ప్రసవం తర్వాత మాయను పూర్తిగా తొలగించకపోవడంతో..

ప్రసవం తర్వాత కడుపులో మాయను పూర్తిగా తొలగించలేదు. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, శరీరం రంగు మారింది.. ఆ తర్వాత..

TNN 16 Oct 2017, 7:00 pm
కెనడాకు చెందిన లిండ్సే హుబ్లీ అనే 33 ఏళ్ల మహిళ హాస్పిటల్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు కాబోయే భర్త మైక్ శాంప్సన్‌తో అంతా ఓకే అని చెప్పిన డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. కానీ తీవ్రమైన కడుపు నొప్పు, శరీరం రంగు మారడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లింది. దీంతో అత్యవసరంగా ఆమెకు సర్జరీ చేసి చేతులు, కాళ్లు తొలగించారు. మాంసాన్ని తినే నెక్రొటైజింగ్ ఫాసిటిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని డాక్టర్లు తెలిపారు. ప్రసవం తర్వాత బాలింత కడుపులోని మాయను పూర్తిగా తొలగించక పోవడంతో.. అది ఇన్ఫెక్షన్‌కు దారి తీసిందని డాక్టర్లు వెల్లడించారు.
Samayam Telugu first time mother has all four limbs amputated because whole placenta wasnt removed
ప్రసవం తర్వాత మాయను పూర్తిగా తొలగించకపోవడంతో..


సర్జరీ చేసి కాళ్లు, చేతులు తొలగించిన ఏడు నెలల తర్వాత ఆమె కాస్త కోలుకుంది. కానీ లిండ్సే‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే లిండ్స్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గోఫండ్ మీ పేజీలో ఆమె పేరిట విరాళాలు సేకరిస్తున్నారు.

నెక్రొటైజింగ్ ఫ్యాస్కిటిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఇది ఒంట్లోని పక్క కణాలనే తినేస్తుంది. ఇది చాలా అరుదుగా సోకుతుంది. కానీ ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో ప్రతి నలుగురిలో ఒకరు మరణించే అవకాశాలు ఉన్నాయి.

ప్రసవం తర్వాత బాలింత కడుపులోని మాయను పూర్తిగా తొలగించాలి. లేకపోతే అధిక రక్తస్రావం అవుతుంది. శరీరం ఇన్ఫెక్షన్‌ బారిన పడుతుంది. ఒక్కోసారి ప్రాణానికే ముప్పు తలెత్తుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.