యాప్నగరం

ఇద్దరు భార్యలు, పిల్లలతో.. వ్యక్తి ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకుంది.

TNN 15 Sep 2017, 5:05 pm
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మైల‌వ‌రం జ‌లాశ‌యంలోకి ఐదుగురు వ్య‌క్తులు దూకడాన్ని గమనించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కి స‌మాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఇప్ప‌టికి ముగ్గురిని వెలికి తీశారు. అయితే, ఆ ముగ్గురు అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయార‌ు. వారిని ష‌మీమ్ (40), ఆషా (29), మ‌హ‌బూబీ (19) గా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu five members in a family suicide attempt at kadapa
ఇద్దరు భార్యలు, పిల్లలతో.. వ్యక్తి ఆత్మహత్య


జ‌లాశ‌యంలోకి దూకిన మ‌రో ఇద్ద‌రు వాహిద్ (42), ష‌బానా (17) కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితులంతా జ‌మ్మ‌లమ‌డుగు మండలం రాజీవ్‌న‌గ‌ర్ కాల‌నీ వాసులని తెలిపారు. వీరిలో వాహీద్ వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డానికి ఆర్థిక ఇబ్బందులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. జమ్మలమడుగు ఇంఛార్జి డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కథనం ప్రకారం....జమ్ములమడుగు మండలం రాజీవ్‌ కాలనీకి చెందిన వాహద్‌(42) డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతని మొదటి భార్య షమీమ్‌, కుమార్తెలు మహబూబి, షబానా, అతడి రెండో భార్య ఆషా శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆర్థిక ఇబ్బందులతో జలాయశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జలాశయం పక్కన లభించిన ఆధార్ కార్డులు ఆధారంగా వీరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.