పనికిమాలిన మొబైల్ చార్జర్ను విక్రయించడమే కాకుండా, దాని కారణంగా వినియోగదారుడి ఫోన్ పాడైనందుకు దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ అతనికి పరిహారం చెల్లించనుంది. ఆ చెత్త చార్జర్ కారణంగా నష్టపోయిన వినియోగదారుడికి రూ. 15వేలు చెల్లించాల్సిందిగా వినియోగదారుల కోర్టు ఫ్లిప్కార్ట్ను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ అక్ ఇర్ఫానీ ఈ ఏడాది జనవరిలో ఫ్లిప్కార్ట్లో మొబైల్ చార్జర్ను రూ. 259లకు కొనుగోలు చేశారు.
ఆ చార్జర్తో తన స్మార్ట్ఫోన్కు చార్జింగ్ పెట్టారు. ఆ తరవాత 10 నిమిషాలు కూడా గడవకుండానే స్మార్ట్ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఫోన్లోని వైర్లన్నీ కాలిపోయి అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీనిపై ఫ్లిప్కార్ట్కు ఆయన ఫిర్యాదు చేశారు. ‘చార్జర్ మంచిది కాదంటున్నారు కాబట్టి దాన్ని మారుస్తాం. కానీ మీ పాడైపోవడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఫ్లిప్కార్ట్ బదులిచ్చింది. అంతేకాకుండా మీ ఫోన్లో పవర్ ఎక్కువైపోవడం వల్ల కాలిపోయి ఉండొచ్చు అని సలహా కూడా ఇచ్చారు. దీంతో ఒళ్లుమండిన ఇర్ఫాన్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
తనకు డెలివరీ చేసిన చార్జర్ 100 నుంచి 240 వోల్ట్స్ మధ్య పవర్ను తట్టుకుంటుందని ఫ్లిప్కార్ట్ స్పష్టంగా తెలిపినట్లు ఇర్ఫానీ కోర్టుకు వివరించారు. దానికి అనుగుణంగానే తాను స్మార్ట్ఫోన్కు చార్జింగ్ పెట్టానని, కానీ ఆ చార్జర్ మంచిది కాకపోవడం వల్ల తన ఫోన్ నాశనం అయ్యిందని చెప్పారు. కాబట్టి తనకి ఫ్లిప్కార్ట్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టుకు విన్నవించారు. అయితే తాము విక్రయదారులకు, కొనుగోలుదారులకు మధ్యవర్తిగా వ్యవహరించి ఎన్నో ఉత్పత్తులు విక్రయిస్తామని, వాటిలో అన్నీ నాణ్యమైనవే ఉంటాయని ఫ్లిప్కార్ట్ వాదించింది.
స్మార్ట్ఫోన్లోకి ఎక్కువ కరెంట్ ఫ్లో అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయిందని, అంతేకానీ చార్జర్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. అయితే ఫ్లిప్కార్ట్ వాదనతో సంతృప్తి చెందని కోర్టు.. ఆ కంపెనీ అమ్మిన చెత్త చార్జర్ వల్లే ఫోన్ పాడైనట్లు నిర్దారించింది. చార్జర్ ధరను తిరిగి ఇవ్వడంతో పాటు పాడైన ఫోన్ ఖరీదును కూడా పరిహారంగా ఇవ్వాలని ఫ్లిప్కార్ట్ను కోర్టు ఆదేశించింది. కాలిపోయిన ఫోన్ ఖరీదు రూ. 15వేలు కావడంతో అంతమొత్తం ఇర్ఫానీకి ఫ్లిప్కార్ట్ అందజేస్తుంది.
ఆ చార్జర్తో తన స్మార్ట్ఫోన్కు చార్జింగ్ పెట్టారు. ఆ తరవాత 10 నిమిషాలు కూడా గడవకుండానే స్మార్ట్ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఫోన్లోని వైర్లన్నీ కాలిపోయి అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీనిపై ఫ్లిప్కార్ట్కు ఆయన ఫిర్యాదు చేశారు. ‘చార్జర్ మంచిది కాదంటున్నారు కాబట్టి దాన్ని మారుస్తాం. కానీ మీ పాడైపోవడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఫ్లిప్కార్ట్ బదులిచ్చింది. అంతేకాకుండా మీ ఫోన్లో పవర్ ఎక్కువైపోవడం వల్ల కాలిపోయి ఉండొచ్చు అని సలహా కూడా ఇచ్చారు. దీంతో ఒళ్లుమండిన ఇర్ఫాన్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
తనకు డెలివరీ చేసిన చార్జర్ 100 నుంచి 240 వోల్ట్స్ మధ్య పవర్ను తట్టుకుంటుందని ఫ్లిప్కార్ట్ స్పష్టంగా తెలిపినట్లు ఇర్ఫానీ కోర్టుకు వివరించారు. దానికి అనుగుణంగానే తాను స్మార్ట్ఫోన్కు చార్జింగ్ పెట్టానని, కానీ ఆ చార్జర్ మంచిది కాకపోవడం వల్ల తన ఫోన్ నాశనం అయ్యిందని చెప్పారు. కాబట్టి తనకి ఫ్లిప్కార్ట్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టుకు విన్నవించారు. అయితే తాము విక్రయదారులకు, కొనుగోలుదారులకు మధ్యవర్తిగా వ్యవహరించి ఎన్నో ఉత్పత్తులు విక్రయిస్తామని, వాటిలో అన్నీ నాణ్యమైనవే ఉంటాయని ఫ్లిప్కార్ట్ వాదించింది.
స్మార్ట్ఫోన్లోకి ఎక్కువ కరెంట్ ఫ్లో అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయిందని, అంతేకానీ చార్జర్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. అయితే ఫ్లిప్కార్ట్ వాదనతో సంతృప్తి చెందని కోర్టు.. ఆ కంపెనీ అమ్మిన చెత్త చార్జర్ వల్లే ఫోన్ పాడైనట్లు నిర్దారించింది. చార్జర్ ధరను తిరిగి ఇవ్వడంతో పాటు పాడైన ఫోన్ ఖరీదును కూడా పరిహారంగా ఇవ్వాలని ఫ్లిప్కార్ట్ను కోర్టు ఆదేశించింది. కాలిపోయిన ఫోన్ ఖరీదు రూ. 15వేలు కావడంతో అంతమొత్తం ఇర్ఫానీకి ఫ్లిప్కార్ట్ అందజేస్తుంది.