యాప్నగరం

గాలి కోసం.. విమానం డోర్ తెరిచాడు!

వర్షాకాలంలో ప్రయాణమంటే.. సహనానికి పరీక్షే. అందులో విమానంలో ప్రయాణమంటే ఇంకా విసిగిస్తుంది. వాతావరణం అనుకూలంగా లేకపోతే.. విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తాయి.

Samayam Telugu 6 Jun 2018, 6:59 pm
ర్షాకాలంలో ప్రయాణమంటే.. సహనానికి పరీక్షే. అందులో విమానంలో ప్రయాణమంటే ఇంకా విసిగిస్తుంది. వాతావరణం అనుకూలంగా లేకపోతే.. విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తాయి. లేదా, వేరే నగరాల్లోని విమానాశ్రయాలకు డైవర్ట్ (మళ్లింపు) అవుతాయి. దీంతో వర్షాకాలంలో విమాన ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు.
Samayam Telugu AR-150909663


ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఎంతగా విసిగిపోతారో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్ - ముంబయి (AI 985) విమానం అహ్మదాబాద్ నుంచి రాత్రి 7.30 గంటలకు ముంబయికి బయల్దేరింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని రాత్రి 9.40 గంటలకు గోవా విమానాశ్రయానికి మళ్లించారు.

అలా కొన్ని గంటల పాటు విమానం గోవాలోనే నిలిచిపోవడంతో ఓ ప్రయాణికుడు తీవ్రమైన ఒత్తిడి గురయ్యాడు. విమానంలోని ఎమెర్జెన్సీ డోర్ పక్కనే కూర్చున్న అతడు.. ఒక్కసారిగా ఆ డోర్ తెరిచాడు. దీంతో.. ఆ డోర్‌కు ఉండే బెలూన్లు వంటి స్లైడ్లు (అత్యవసర సమయంలో మెట్లకు బదులు.. జారుతూ కిందకి దిగేందుకు ఉపయోగిస్తారు) ఒక్కసారే తెరుచుకున్నాయి.
ఆ ప్రయాణికుడు చేసిన పనికి విమాన సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అతని చర్య వల్ల విమానం బయల్దేరేందుకు మరింత సమయం పట్టింది. తెరుచుకున్న స్లైడ్‌ను మళ్లీ యథాస్థితిలో చేర్చి, డోరును మూసేందుకు కొన్ని గంటల సమయం పట్టింది. దీంతో ఆ విమానం మంగళవారం తెల్లవారుజాము 5.33 గంటలకు గోవా నుంచి బయల్దేరి.. 6.33 గంటలకు ముంబయి చేరుకుంది. అంటే సుమారు పది గంటల ఆలస్యంగా గమ్యానికి చేరింది.

ఎమర్జెన్సీ డోర్‌ను ఎందుకు తెరిచారని విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని ప్రశ్నించగా.. ‘‘ఊపిరి ఆడట్లేదని.. గాలి కోసం తెరిచా’’ అని సమాధానం చెప్పాడు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఆ ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది.
Read this article in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.