కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులో ప్యాలెస్ మైదానంలో బుధవారం గాలి కుమార్తె బ్రహ్మణికి, రాజీవ్ రెడ్డితో వివాహం జరిగింది. దీనికి వేలాది మంది అతిధులు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పూజారులు ఈ పెళ్లి తంతును జరిపించారు. పెళ్లికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన అతిథులు హాజరయ్యారు. పెళ్లి మండపాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాలెస్ మైదానంలో భారీ సెట్టింగులతో పెళ్లి మండపాన్ని సిద్ధం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెళ్లికి హాజరయ్యారు.
వైభవంగా గాలి వారి పెళ్లి సందడి
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది
TNN 16 Nov 2016, 8:16 pm