యాప్నగరం

నన్ను రేప్ చేశారు, న్యాయం చేయండి.. మోదీకి బాలిక లేఖ

తనపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, న్యాయం చేయాలంటూ ఓ దళిత విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

TNN 14 Jun 2017, 8:15 am
తనపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, న్యాయం చేయాలంటూ ఓ దళిత విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా శిరూరు గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఈ లేఖ రాసింది.
Samayam Telugu gang raped dalit girl from bagalkot writes to modi for justice
నన్ను రేప్ చేశారు, న్యాయం చేయండి.. మోదీకి బాలిక లేఖ


లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో చదువుకుంటున్న బాలికను.. ఉపకార వేతనం ఇప్పిస్తానని స్కూల్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌ కాళవ్వగోల్ నమ్మించాడు. అతని ఇద్దరు స్నేహితులతో కలసి బాలికను కారులో తీసుకెళ్లి దారి మధ్యలో మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తరవాత సామూహిక అత్యాచారం చేశారు.

‘ఈ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించారు. వీడియోను చూపిస్తూ విజయకుమార్‌ నన్ను బెదిరిస్తున్నాడు. సామూహిక అత్యాచారం తరువాత నాకు తీవ్ర జ్వరం వచ్చింది. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్తే అత్యాచారం జరిగిన విషయాన్ని డాక్టర్ గుర్తించారు. కానీ గ్రామంలో పరువుపోతుందని నా తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టలేదు. నాలాగే కొందరు విద్యార్థినులపై విజయకుమార్‌, అతని స్నేహితులు లైంగిక దాడులు చేస్తున్నారు’ అని లేఖలో స్పష్టంగా పేర్కొంది.

తన టీచర్ సహాయంతో లేఖను ఇంగ్లిష్‌లో రాయించిన బాలిక దాన్ని ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారి, జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కి పంపింది. బాలిక లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.