హైదరాబాద్ నగరం స్టార్టప్ల హబ్గా మారుతోంది. తెలంగాణ సర్కారు టీ-హబ్ పేరిట స్టార్టప్ల ఏర్పాటుకు తన వంతుగా సాయం చేస్తోంది. మరి వీటిని చూసి స్ఫూర్తి పొందాడేమో.. బ్యాంకులో ఉద్యోగం చేసి మానేసిన 33 ఏళ్ల సయ్యద్ షాహెద్ హుస్సేన్ ఓ ఫ్లాట్లో స్టార్టప్ పెట్టేశాడు. కాకపోతే ఆయన మొదలెట్టింది ఏ ఐటీ కంపెనీయో కాదు.. ఓ గంజాయి వనం. నగరంలో మణికొండ ప్రాంతంలో ఓ డబుల్ బెడ్రూం ఫ్లాట్లో గంజాయి మొక్కల సాగు చేపట్టాడు. ఫ్లాట్లో అతడు గంజాయిని సాగు చేస్తున్న విధానం చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు.
ముంబైలోని డ్రగ్ మాఫియాకు విక్రయించేందుకు వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు గంజాయి మొక్కలను పెంచుతూ ఇటీవల పట్టుబడ్డారు. కానీ నగరంలోనే గంజాయి సాగు చేస్తూ సయ్యద్ చిక్కడం పోలీసులు సహా ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం రాత్రి గోల్కొండ దగ్గర గంజాయి అమ్ముతూ సయ్యద్ పోలీసులకు టాస్క్ఫోర్స్ విభాగానికి చిక్కాడు. దీంతో అతడి అపార్టమెంట్కి వచ్చి సోదాలు జరపగా.. 40కిపైగా పూలకుండీల్లో గంజాయి మొక్కలను పెంచడం వారి కంటబడింది. దీంతో వారు ఆ మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సైకాలజీలో డిగ్రీ చేసిన సయ్యద్ మణికొండలోని వైకే రెసిడెన్సీలో మూడు నెలల క్రితం ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు.
గంజాయి మొక్కలకు అనుకూలంగా ఉష్ణోగ్రతలు ఉండేలా చూడటం కోసం సయ్యద్ రెండు గదుల్లో ఏసీని ఏర్పాటు చేశాడు. మొక్కలకు వెలుతురు సోకడం కోసం ఎల్ఈడీ లైట్లు, గాలి ధారాళంగా తగలడం కోసం టేబుల్ ఫ్యాన్లను ఏర్పాటు చేశాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ కోటి రెడ్డి తెలిపారు. టీనేజీ నుంచే గంజాయికి అలవాటు పడిన సయ్యద్ గత కొన్నేళ్లుగా డ్రగ్ అమ్మకాలు సాగిస్తున్నాడు.
విశాఖ, తూర్పుగోదావరి, తాండూరుల్లో కిలో రూ.3,500 చొప్పున గంజాయి కొనుగోలు చేసే సయ్యద్.. హైదరాబాద్లోని కస్టమర్లకు కిలో రూ.16 వేల చొప్పున అమ్మేవాడు. తర్వాత తానే గంజాయి మొక్కలను సాగు చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో అమెరికాలోని గ్యారిత్ క్రిస్టోఫర్ అనే స్నేహితుడిని సంప్రదించాడు. అతడి సలహా మేరకు ఆన్లైన్లో వీడియోలు చూసిన సయ్యద్ గంజాయి సాగులో మెలకువలను ఒంట బట్టించుకున్నాడు. గంజాయి సాగు కోసం విశాఖ, కర్ణాటక నుంచి పోషక విలువలున్న మట్టిని తీసుకొచ్చి స్టాక్ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు సాగు చేస్తోంది ట్రయల్ రన్లో భాగంగా మాత్రమే. ఒకవేళ అతడు గనుక టాస్క్ఫోర్స్కి చిక్కకపోయుంటే.. పెద్ద అపార్ట్మెంట్ మొత్తంలో గంజాయి సాగు చేసేవాడేమో.
ముంబైలోని డ్రగ్ మాఫియాకు విక్రయించేందుకు వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు గంజాయి మొక్కలను పెంచుతూ ఇటీవల పట్టుబడ్డారు. కానీ నగరంలోనే గంజాయి సాగు చేస్తూ సయ్యద్ చిక్కడం పోలీసులు సహా ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం రాత్రి గోల్కొండ దగ్గర గంజాయి అమ్ముతూ సయ్యద్ పోలీసులకు టాస్క్ఫోర్స్ విభాగానికి చిక్కాడు. దీంతో అతడి అపార్టమెంట్కి వచ్చి సోదాలు జరపగా.. 40కిపైగా పూలకుండీల్లో గంజాయి మొక్కలను పెంచడం వారి కంటబడింది. దీంతో వారు ఆ మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సైకాలజీలో డిగ్రీ చేసిన సయ్యద్ మణికొండలోని వైకే రెసిడెన్సీలో మూడు నెలల క్రితం ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు.
గంజాయి మొక్కలకు అనుకూలంగా ఉష్ణోగ్రతలు ఉండేలా చూడటం కోసం సయ్యద్ రెండు గదుల్లో ఏసీని ఏర్పాటు చేశాడు. మొక్కలకు వెలుతురు సోకడం కోసం ఎల్ఈడీ లైట్లు, గాలి ధారాళంగా తగలడం కోసం టేబుల్ ఫ్యాన్లను ఏర్పాటు చేశాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ కోటి రెడ్డి తెలిపారు. టీనేజీ నుంచే గంజాయికి అలవాటు పడిన సయ్యద్ గత కొన్నేళ్లుగా డ్రగ్ అమ్మకాలు సాగిస్తున్నాడు.
విశాఖ, తూర్పుగోదావరి, తాండూరుల్లో కిలో రూ.3,500 చొప్పున గంజాయి కొనుగోలు చేసే సయ్యద్.. హైదరాబాద్లోని కస్టమర్లకు కిలో రూ.16 వేల చొప్పున అమ్మేవాడు. తర్వాత తానే గంజాయి మొక్కలను సాగు చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో అమెరికాలోని గ్యారిత్ క్రిస్టోఫర్ అనే స్నేహితుడిని సంప్రదించాడు. అతడి సలహా మేరకు ఆన్లైన్లో వీడియోలు చూసిన సయ్యద్ గంజాయి సాగులో మెలకువలను ఒంట బట్టించుకున్నాడు. గంజాయి సాగు కోసం విశాఖ, కర్ణాటక నుంచి పోషక విలువలున్న మట్టిని తీసుకొచ్చి స్టాక్ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు సాగు చేస్తోంది ట్రయల్ రన్లో భాగంగా మాత్రమే. ఒకవేళ అతడు గనుక టాస్క్ఫోర్స్కి చిక్కకపోయుంటే.. పెద్ద అపార్ట్మెంట్ మొత్తంలో గంజాయి సాగు చేసేవాడేమో.