యాప్నగరం

గన్ గురిపెట్టి బాలికపై కిరాతకం..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పదకొండేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక తల్లి, సోదరుడికి తుపాకీ గురిపెట్టి బెదిరించి, వారి ముందే ఆ చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు..

TNN 5 Sep 2017, 5:09 pm
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పదకొండేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక తల్లి, సోదరుడికి తుపాకీ గురిపెట్టి బెదిరించి, వారి ముందే ఆ చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గత బుధవారం (ఆగస్టు 30) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తన తల్లి, సోదరుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముగ్గురు దుండగులు వారి నివాసంలోకి ప్రవేశించారు.
Samayam Telugu girl gang raped at gunpoint in gwalior 3 arrested
గన్ గురిపెట్టి బాలికపై కిరాతకం..


ఇద్దరు వ్యక్తులు తల్లికి, సోదరుడికి తుపాకీ గురిపెట్టి చంపుతామని బెదిరించగా.. మూడో వ్యక్తి బాలికపై కిరాతకపర్వం కొనసాగించాడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తామని వారిని బెదిరించి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కుంగిపోయిన బాధితురాలి కుటుంబం ఆలస్యంగానైనా పోలీసులను ఆశ్రయించింది.

కేసును తీవ్రంగా పరిగణించిన బిజోలీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ముగ్గురు నిందితులనూ ఆదివారం అరెస్టు చేశారు. జాన్వార్ సింగ్ కుష్వా (36) ఈ కిరాతకానికి ఒడిగట్టగా.. రామ్ కుష్వా (25), రామ్‌నివాస్ కుష్వా (24) అతడికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.