తల్లిదండ్రులను వదిలి తనతో రాకపోతే నీ నగ్న వీడియోలను ఆన్లైన్లో పోస్టు చేస్తానంటూ ప్రియుడు బెదిరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని రూప్నగర్లో చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీలో బీకాం చదువుతున్న మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల యువతి, బీహార్ యువకుడు వేదప్రకాశ్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. నార్త్ ఢిల్లీలో ఈ ఇద్దరూ కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించకపోవడం ఆయువతిని తనతో బీహార్ వచ్చేయాలంటూ వేదప్రకాశ్ బలవంతం చేశాడు.
దీనికి ఆమె నిరాకరించడమే కాదు అతను ఫోన్ చేసినా స్పందిచడం మానేసింది. దీంతో నిందితుడు తనతో రాకపోతే మన ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. వేద ప్రకాశ్ బెదిరింపులతో ఆందోళన చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు తనపై అత్యాచారం చేశాడని గతంలో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
ప్రియుడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఓ మహిళ దీనిపై ఏప్రిల్ 8 న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సూసైడ్ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వేదప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని వాయవ్య ఢిల్లీ పోలీస్ కమిషనర్ మిలింద్ దుబేరా పేర్కొన్నారు.
దీనికి ఆమె నిరాకరించడమే కాదు అతను ఫోన్ చేసినా స్పందిచడం మానేసింది. దీంతో నిందితుడు తనతో రాకపోతే మన ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. వేద ప్రకాశ్ బెదిరింపులతో ఆందోళన చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు తనపై అత్యాచారం చేశాడని గతంలో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
ప్రియుడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఓ మహిళ దీనిపై ఏప్రిల్ 8 న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సూసైడ్ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వేదప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని వాయవ్య ఢిల్లీ పోలీస్ కమిషనర్ మిలింద్ దుబేరా పేర్కొన్నారు.