యాప్నగరం

శీలానికి వెల కట్టిన పెద్దలు.. అబార్షన్, మృతి

వికలాంగురాలైన ఓ గిరిజన బాలికను లొంగదీసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అతడి కామవాంఛకు గర్భం దాల్చింది ఆ బాలిక

Samayam Telugu 11 Jun 2017, 11:46 am
వికలాంగురాలైన ఓ గిరిజన బాలికను లొంగదీసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అతడి కామవాంఛకు గర్భం దాల్చింది ఆ బాలిక. తల్లిదండ్రులు తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని సదరు ప్రబుద్ధుడిని బతిమాలాడారు. కానీ అతడు, ఊరి పెద్దలు మాత్రం శీలానికి వెలకట్టి అబార్షన్ చేయించారు. ఊరి పెద్దలు గర్భం దాల్చడానికి కారణమైనవాడికి రూ.40వేలు జరిమానా విధించి పంచాయితీ ముగించేశారు. అబార్షన్ చేయించి ఇంటికి పంపారు. రెండు నెలల తర్వాత ఆ బాలిక అనారోగ్యంతో మృతి చెందింది.
Samayam Telugu girl raped got pregnancy paid for abortion dies
శీలానికి వెల కట్టిన పెద్దలు.. అబార్షన్, మృతి


దుర్మార్గమైన ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వికలాంగురాలైన గిరిజన బాలిక వాంకుడోత్ రాణి (15)కి అదే ఊరికి చెందిన చెన్న కేశవులు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత రాణి గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు.

రాణి కుటుంబ సభ్యులు పంచాయితీ పెడితే.. ఊరిపెద్దలు బాధితురాలికి రూ.40వేలు ఇచ్చేలా చెన్నకేశవులుకు జరిమానా విధించి రాజీ కుదిర్చారు. చెన్నకేశవులు తల్లి లచ్చి బాలికకు ఖమ్మంలో అబార్షన్ చేయించింది. బాలిక రెండు నెలల తర్వాత అనారోగ్యంతో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 12మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.