యాప్నగరం

అబ్బాయి అసభ్య ఫోటోలు నెట్‌లో పెట్టి...

సైబర్ క్రైమ్‌కి ఎక్కువ శాతం అమ్మాయిలే బాధితులవుతున్నారు.

TNN 8 Feb 2017, 4:53 pm
సైబర్ క్రైమ్‌కి ఎక్కువ శాతం అమ్మాయిలే బాధితులవుతున్నారు. అయితే అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా దీని బారిన పడుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైబర్ క్రైమ్ పై ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో సైబర్ క్రైమ్‌కు బాధితులుగా మారొద్దని ప్రచారం చేశారు. ఇందులో భాగం ఓ కేస్ స్టడీని చెప్పారు. వడోదరకు చెందిన ఓ యువకుడి ఫోటోలతో ఫేస్ బుక్‌లో ఎకౌంట్ క్రియేట్ చేశారు. అందులో మార్ఫింగ్ చేసిన అతడి అసభ్యకరమైన ఫోటోలను పోస్టు చేశారు. దాంతో ఆ యువకుడు తన తల్లిదండ్రుల కలిసి వెళ్లి సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు చెప్పాడు. తాను కొన్ని రోజుల క్రితమే ప్రియురాలితో విడిపోయాయనని ఆమెనే వాటిని పెట్టిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
Samayam Telugu girl takes cyber revenge on boyfriend after breakup in vadodara
అబ్బాయి అసభ్య ఫోటోలు నెట్‌లో పెట్టి...


పోలీసులు విచారణలో తన తాజా ప్రియురాలే కాకుండా చాలా మంది అమ్మాయిలపై అనుమానం వ్యక్తం చేశాడు. అంత మందితో అతను లవ్ లో బ్రేకప్ అయ్యాడు. దీంతో వారిలో ఏ అమ్మాయో ఆ పని చేసిందని అనుమానం. కాగా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాజాగా అతనితో విడిపోయిన అమ్మాయే పగ తీర్చుకునేందుకు ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.