యాప్నగరం

కట్నం కోసం వేధిస్తే... ఇలాగే బుద్ధి చెప్పాలి

వరకట్నం అడిగిన వరుడికి భలే షాకిచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు.

TNN 2 May 2017, 11:44 am
వరకట్నం అడిగిన వరుడికి భలే షాకిచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది వరుడికి. అసలేం జరిగిందంటే... హర్యానాలోని పల్వల్ నగరంలో ఫరీద్ ఖురేషి అనే యువకుడు కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి స్థానికంగా ఉండే యువతితోనే పెళ్లి జరిగింది. వధువును అత్తవారింటికి తీసుకెళ్లేందుకు వరుడు, అతని సోదరులు, మరో ఇద్దరు వచ్చారు. ఇంకా భార్యని కాపురానికి తీసుకెళ్లక ముందే తనకు అదనంగా కట్నం కావాలని అడిగాడు. ఇవ్వలేమని చెప్పిన వధువు కుటుంబాన్ని దూషించాడు. కోపం వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వరుడితో పాటూ వచ్చిన వారందరినీ గదిలో పెట్టి తాళమేశారు. అనంతరం గ్రామపెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
Samayam Telugu groom others held hostage after dowry demand
కట్నం కోసం వేధిస్తే... ఇలాగే బుద్ధి చెప్పాలి


పంచాయతీ పెద్దలు వధువు పేరు మీద నాలుగు బిఘాల భూమిని రాయాలని ఆదేశించారు. లేదా ఆమె పేరును పదిలక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ వేయాలని చెప్పారు. అలా అయితేనే అమ్మాయి అత్తవారింటికి వస్తుందని లేకుంటే కాపురానికి రాదని తేల్చి చెప్పారు. వరుడికి దిమ్మదిరిగింది. కాసుల కోసం కక్కుర్తి పడి అదనపు కట్నం అడిగితే... ఇలా బుక్కయి పోయానేంట్రా అనుకున్నాడు. పోలీసులు విషయం తెలిసినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వారు కలగజేసుకోలేదు. ఇంకా వధువు, వరుడి కుటుంబాల మధ్య, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.