యాప్నగరం

దారుణం: వేధిస్తూ వీడియో తీసిన అల్లరి మూక

ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక యాంటీ రోమియో స్క్వాడ్ ల పేరుతో

Samayam Telugu 28 May 2017, 1:34 pm
ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక యాంటీ రోమియో స్క్వాడ్ ల పేరుతో మహిళలను వేధించే ఆకతాయిల పని పట్టిస్తున్నామని చెబుతున్నా.. రాష్ట్రంలో పోకిరీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ఆవారాగాళ్లు ఒంటరిగా కనిపించిన మహిళలపై వేధింపులకు దిగుతున్నారు. నివ్వెరపోయిన ఘటన ఒకటి ఇటీవల యూపీలోని రాంపూర్ లో చోటు చేసుకుంది.
Samayam Telugu gundaraj in up youth filmed while groping women
దారుణం: వేధిస్తూ వీడియో తీసిన అల్లరి మూక


దాదాపు 12 నుంచి 14 మంది యువకులు (ఇందులో బాలలు కూడా ఉన్నారు) ఇద్దరు మహిళను తీవ్రంగా వేధించారు. అంతటితో ఆగకుండా వీడియోతీసి ఏకంగా సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ఒక యువతిని బలవంతంగా ఎత్తుకుపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించడం, సదరు యువతితో పాటున్న మరో మహిళ ఆకతాయిలను ప్రతిఘటించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఎదురు తిరిగిన మహిళలపై పోకిరీలు దాడి చేశారు. లైంగికంగా వేధించారు. తమను వెళ్లనివ్వాలని ఆ ఇద్దరు ప్రాధేయపడినా వారు వినలేదు. పైగా ఆ బాలురు వారిని చూసి పెద్దగా నవ్వుతూ జోకులు వేస్తూ అరిచారు. వీరి ఆగడాలను అడ్డునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు యువకులపై దాడి చేశారు.
ఈ తతంగం మొత్తాన్ని ఆ గ్యాంగులోని కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూపీలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.