యాప్నగరం

పందికి మనిషి జననం: ఈ వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నమ్మేవారు ఉండాలే గానీ.. సోషల్ మీడియాలో ఎన్ని అవాస్తవాలైనా ప్రచారం చేసేస్తారు. ఇలాంటి అసత్య వార్తల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి.

Samayam Telugu 3 Aug 2018, 5:46 pm
మ్మేవారు ఉండాలే గానీ.. సోషల్ మీడియాలో ఎన్ని అవాస్తవాలైనా ప్రచారం చేసేస్తారు. ఇలాంటి అసత్య వార్తల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరుగుతున్న మూక దాడులకు ఇలాంటి అసత్య, కల్పిత వార్తలే ప్రధాన కారణం!!
Samayam Telugu Telugu-image


ఇటీవల పంది కడుపున మనిషి పుట్టాడంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. బ్రహ్మంగారు చెప్పింది నిజమైందని, తెలంగాణలోని యాదాద్రిలో పంది కడుపున మనిషి పుట్టాడంటూ కొందరు ఆకతాయిలు ప్రచారం మొదలుపెట్టారు. చాలా మంది ఇది నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేయడం మొదలుపెట్టారు.

ఈ ఫేక్ న్యూస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. కెన్యాలోని మురంగాలో ఉన్న పందులశాలలో పందికి మనిషి పుట్టాడనే ప్రచారం జరిగింది. వాస్తవానికి అది ప్రాణే కాదు. సిలికాన్ బొమ్మ. ఇటలీకి చెందిన మగనుకో లైరా అనే కళాకారుడు దీన్ని రూపొందించాడు.

లైరా సహజత్వం ఉట్టిపడే ఇలాంటి సిలికాన్ కళాఖండాలను ఎన్నో తయారు చేశారు. వాటిలో ఒకటి ఈ పంది రూపంలో మానవ శిశువు. ఆయన ఆన్‌లైన్లో విక్రయించేందుకు దాని ఫొటోలు పెట్టారు. కొందరు ఆ ఫొటోలకు తప్పుడు సమాచారం జోడించి వైరల్ చేశారు. కాబట్టి, మీకు ఇలాంటి వార్తలు ఎవరైనా షేర్ చేస్తున్నట్లయితే.. వెంటనే నమ్మేయకుండా, మీకు వాటిని ఎవరైతే పంపుతారో వారిని ఆధారాలు అడగండి. గుడ్డిగా వాటిని నమ్మి.. ఇతరులతో షేర్ చేసుకుంటే.. మీరు ఆ నేరం చేసినవారి జాబితాలో చేరుతారు. తస్మత్ జాగ్రత్త.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.