యాప్నగరం

పెళ్లవ్వకుండానే గర్భం దాల్చిందని...

తెలంగాణ రాష్ట్రం.. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని కుటుంబ సభ్యులు ఆగ్రహాంతో కూతురును చంపేశారు.

Samayam Telugu 15 Oct 2016, 10:43 am
తెలంగాణ రాష్ట్రం.. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని కుటుంబ సభ్యులు ఆగ్రహాంతో కూతురును చంపేశారు. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరికి దొరికిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని కడ్తల్ మండలం మైసిగండి గ్రామపంచాయతీ పరిధిలోని మొగులురాళ్ల తండాలో జరిగింది.
Samayam Telugu honour killing in telangana mother kills her daughter
పెళ్లవ్వకుండానే గర్భం దాల్చిందని...


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఇస్లావత్ దేవ్లా, సోని దంపతుల కుమార్తె (19)కొంతకాలం క్రితం నల్గొండ జిల్లా దేవరకొండలోని బంధువుల ఇంట్లో ఉంది. ఈ మధ్యే ఇంటికి వచ్చింది. అయితే కూతురు ప్రవర్తనలో తేడా రావడం, గర్భం దాల్చిందని తల్లిదండ్రులు, మంజుల సోదరులు తెలుసుకున్నారు.
అయితే తనకు గర్భం రావడానికి కారకుడెవరు అని మంజులను ఎంత ప్రశ్నించినా ఆమె చెప్పలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కుటుంబం సభ్యులను మంజులను తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు మృతి చెందిన మంజుల నోట్లో పురుగు మందు పోసి ఆత్మహత్య చేసుకుందని తండావాసులను నమ్మించారు.
గురువారం అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే కుటుంబ సభ్యులే మంజులను చంపారని బయటకు పొక్కడంతో రెవెన్యూ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంజుల తల్లిదండ్రులతో పాటు సోదరులను అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.