యాప్నగరం

పరువు హత్య: తల్లిని చంపిన తనయుడు

వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తల్లిని హత్య చేశాడో తనయుడు.

Samayam Telugu 4 Nov 2016, 10:12 am
వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తల్లిని హత్య చేశాడో తనయుడు. హైదరాబాద్ న్యూ బోయిన్ పల్లి పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ గురువారం ఈ సంఘటన జరిగింది.
Samayam Telugu honour killing mother killed by son in hyderabad
పరువు హత్య: తల్లిని చంపిన తనయుడు


రాజు, అరుణ జ్యోతి (40) అనే దంపతులకు ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా అరుణ జ్యోతి ఎదురింట్లో ఉండే రాజేష్ అలియాస్ రాజేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తల్లి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండాన్ని ఆమె తనయుడు రాహుల్ గమనించాడు. చాలాసార్లు హెచ్చరించాడు. ఒకట్రెండు సార్లు రాజేష్ తో జ్యోతి తిరగడాన్ని గమనించాడు.

ఈ విషయంపై ఇంట్లో కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఎంతకీ ఆమెను తీరును మార్చుకోకపోగా...అన్నంలో విషం పెట్టి ఇంట్లో అందర్నీ చంచేస్తానని బెదిరించింది.

దీంతో తమకుటుంబ పరువు బజారుకీడుస్తోందని ఆగ్రహించిన రాహుల్...తన పెద్దమ్మ కుమారుడు గణేష్ (23)తో కలిసి గురువారం ఉదయం అరుణజ్యోతిపై కత్తితో దాడి చేశారు. రక్తమోడుతున్న జ్యోతిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసులు నిందుతులు రాహుల్, గణేష్‌లతోపాటు జ్యోతితో అక్రమ సంబంధం నెరపిన రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.