యాప్నగరం

వివాహేతర సంబంధం: మరిదిని చంపిన వదిన

తమ వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించాడని ప్రియుడితో కలిసి మరిదిని హత్యచేసింది ఒక మహిళ.

TNN 18 Nov 2017, 3:27 pm
తమ వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించాడని ప్రియుడితో కలిసి మరిదిని హత్యచేసింది ఒక మహిళ. చిత్తూరు జిల్లా పీలేరు మండలం తలుపులలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పీలేరు పోలీసుల కథనం మేరకు... తలుపుల గ్రామానికి చెందిన కోళ్ల భాష పెద్ద కుమారుడు మస్తాన్ ఒక టైలర్, అతడి తమ్ముడు యాసీన్ బస్సు డ్రైవర్. మస్తాన్ భార్య దిల్‌షాద్ తో కలిసి తలుపులలోనే కాపురం ఉంటాడు. ఈ నేపథ్యంతో దిల్ షాద్ కు అదే గ్రామానికి చెందిన యోగేంద్రనాయుడు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
Samayam Telugu illigal effairwoman kills her brother in law
వివాహేతర సంబంధం: మరిదిని చంపిన వదిన


ప్రియుడితో కలిసి దిల్ షాద్ శుక్రవారం ఇంట్లో ఉండగా.. అదే సమయంలో యాసీన్ ఇంటికి వచ్చాడు. దిల్ షాద్ ను యోగేంద్రతో చూశాడు అతడు. ఆమెను గట్టిగా ప్రశ్నించాడు. దీంతో దిల్ షాద్, యోగేంద్రలు కలిసి యాసీన్ తలపై కొట్టి చంపారు. అక్కడ నుంచి యోగేంద్ర పరార్ అయ్యాడు. యాసీన్ కళ్లు తిరిగిపడిపోయాడని అంటూ దిల్ షాద్ వైద్యుడికి సమాచారం అందించింది. అతడు వచ్చి పరీక్షించగా అప్పటికే యాసీన్ చనిపోయాడు. వైద్యం కోసమని పీలేరుకు తీసుకెళ్లగా, వైద్యులు యాసీన్ చనిపోయాడని ధ్రువీకరించారు.

ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాడనే.. యాసీన్ ను దిల్ షాద్, యోగేంద్రలు చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దిల్‌షాద్ ను అదుపులోకి తీసుకున్నారు. యోగేంద్ర పరారీలో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.