యాప్నగరం

గదిలోకి తొంగి చూశాడని మూత్రం తాగించారు

ఘజియాబాద్ లో అమానవీయ సంఘటన జరిగింది. పొరుగింటి పడకగదిలోకి తొంగి చూశాడంటూ ఓ వ్యక్తికి శిక్షగా మూత్రం తాగించారు.

Samayam Telugu 19 Feb 2017, 12:46 pm
ఘజియాబాద్ లో అమానవీయ సంఘటన జరిగింది. పొరుగింటి పడకగదిలోకి తొంగి చూశాడంటూ ఓ వ్యక్తికి శిక్షగా మూత్రం తాగించారు. ఈ సంఘటన బోజ్ పూర్ అనే గ్రామంలో చోటు చేసుకుంది.
Samayam Telugu inhuman man forced to drink urine after he peeped into neighbours room
గదిలోకి తొంగి చూశాడని మూత్రం తాగించారు


బాధితుడు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10న ..స్థానికంగా నివసించే 25ఏళ్ల యువకుడు అమిత్ అనే వ్యక్తి పడకగదిలోకి తొంగి చూశాడు. ఆ సమయంలో అమిత్ భార్య పడకగదిలో ఉంది. ఎవరో తనను చూస్తున్నారని భర్తకు చెప్పింది. అమిత్ తలుపు తీసేలోపు ఆ వ్యక్తి పారిపోయాడు.

ఫిబ్రవరి 14న అమిత్ జరిగిన సంఘటనపై గ్రామపంచాయతీ పెట్టించాడు. దీంతో పడకగదిలోకి తొంగి చూసిన వ్యక్తిపై ఊరి పెద్దలు దాడి చేశారు. అక్కడే బలవంతంగా మూత్రం తాగించారు.

మూత్రం తాగిన వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
‘‘పంచాయతీలో 125 మంది దాకా ఉన్నారు. అమిత్, ఆయన భార్య, బంధువులు గూమికూడారు. అమిత్ పడకగదిలోకి తొంగి చూసిన వ్యక్తిని ఒంటికాలిపై నిలబెట్టారు. అమిత్ అతని అన్నదమ్ములు ఆ వ్యక్తిని కొట్టారు. తొంగిచూడటం తప్పేనని ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాడు’’ అని చిరంజిలాల్ అనే గ్రామస్థుడు చెప్పాడు.

‘‘ఆ తర్వాత అమిత్ బంధువులు అతన్ని కొడుతూనే ఉన్నారు. ఊళ్లో కనిపించకూడదని అతన్ని హెచ్చరించారు. కాసేపటికి అమిత్ మూత్రంతో కూడిన ఓ బాటిల్ ను తీసుకొచ్చాడు. బలవంతంగా ఆ వ్యక్తికి తాగించారు. ఎవరూ అమిత్ కుటుంబ సభ్యులను నివారించలేదు. ఆ సంఘటన తర్వాత ఆ వ్యక్తి వేరే ఊరికి వెళ్లిపోయాడు’’ అని చిరంజీలాల్ వివరించారు.

మూత్రం తాగించడంతో అవమానం భరించడంతో బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఇతర గ్రామస్థులు చెప్పారు.

ఈ సంఘటనపై అమిత్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి..అరెస్టు చేశారు.

తమ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడంటూ ఆ వ్యక్తిపై అమిత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.