యాప్నగరం

వంటే కదా అని తీసిపారెయకండి..

నాలుగు గోడల మధ్య వంటింట్లో పనిచేసుకునే మహిళలు సైతం వారి కాళ్లపై వారు నిలబడాలని ప్రధాని మోడీ పలుమార్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

TNN 9 Aug 2016, 5:39 pm
నాలుగు గోడల మధ్య వంటింట్లో పనిచేసుకునే మహిళలు సైతం వారి కాళ్లపై వారు నిలబడాలని ప్రధాని మోడీ పలుమార్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పిలుపునకు స్పందించిన ఒక స్వచ్చంద సంస్థ వంటింటి ఇల్లాళ్లను వ్యాపారవేత్తలుగా చేయడానికి సంకల్పించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రెప్రెన్యూవర్స్ (సీడబ్ల్యూఇ) ఇటీవల సిలిగురిలో నిర్వహించిన మాస్టర్ షెఫ్ సిలిగురి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. స్థానికంగా ఉన్న ఒక ప్రయివేట్ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో పాకశాస్త్రంలో చేయితిరిగిన 75మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా తమ వంటకాలతో అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఇదే వంటలను ఇంట్లో చేస్తే కుటుంబ సభ్యులు కనీసం గుర్తించను కూడా గుర్తించరని, తమ ప్రావీణ్యాన్ని బయట ప్రదర్శించడం వల్ల ఆర్థిక స్వావలంబనతో పాటు ప్రశంసలు కూడా దక్కుతాయని ఈ పోటీల్లో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. కాగా మూడంచెల్లో జరిగే ఈ పోటీల్లో ఫైనల్స్ కు చేరిన మహిళల వంటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చేసి వంటల రంగంలో తోడ్పడతామని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ రజినీ పర్మార్ చెప్పారు. వంటింటికి పరిమితమై అక్కడే తమ జీవితాలను గడిపేస్తున్న మహిళలను బయటకు వచ్చేలా చేసి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని ప్రధాని గతంలో పలుమార్లు పిలుపునిచ్చారని, అదే తమను ఈ తరహా కార్యక్రమాలను రూపొందించడానికి పురికొల్పిందన్నారు.
Samayam Telugu inspired by pm modi 75 homemakers showcase their skills at cooking competition
వంటే కదా అని తీసిపారెయకండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.