యాప్నగరం

స్నాక్స్‌లో విషాహారం, ఇంటర్ విద్యార్థి మృతి

స్నాక్స్ తిని ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.

Samayam Telugu 1 Dec 2016, 12:58 pm
స్నాక్స్ తిని ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.
Samayam Telugu intermediate student died after eating snacks
స్నాక్స్‌లో విషాహారం, ఇంటర్ విద్యార్థి మృతి


వివరాల్లోకి వెళ్తే...అడ్యార్ లోని సెయింట్ మైఖేల్ అకాడమీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శిరీష్ సావియో మంగళవారం ఓ బ్రాండెడ్ కంపెనీకి చెందిన పాప్ కార్న్ తిన్నాడు. ఆ తరువాత కాసేపటికి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే పోస్ట్ మార్టమ్ నిర్వహించాక విద్యార్థి మృతికి అసలు కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రుల వినతి మేరకు మిగతా వివరాలేమీ అసుపత్రి వైద్యులు వెల్లడించలేదు.

ఎప్పుడూ చదువు, ఆటల్లోనూ చురుకుగా ఉండే శిరీష్ ఆకస్మాత్తుగా చనిపోవడం కుటుంబీకులు, అతడి స్నేహితులు, కళశాల టీచర్లు జీర్ణించుకోలేపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.