యాప్నగరం

ఆ దంపతులకు ఆడపిల్ల పుట్టింది

ఐసిస్ లో చేరిన కేరళ దంపతులకు ఆడపిల్ల పుట్టింది.

TNN 13 Sep 2016, 1:15 pm
ఈ ఏడాది మే, జూలైలలో 22 మంది కేరళవాసులు ఐఎస్‌లో చేరేందుకు వెళ్లిన వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. వెళ్లిన వారిలో ముగ్గురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వారిలో ఇజాస్, రఫైలా దంపతులు కూడా ఉన్నారు. ఐసిస్ చేరేందుకు వెళ్లినప్పుడు వీరికి ఏడాదిన్నర కొడుకు ఉండగా రఫైలా మళ్లీ గర్భవతి. కాగా రఫైలా సెప్టెంబర్ 6న ప్రసవించింది. వారికి ఆడపిల్ల పుట్టింది. ప్రస్తుతం వారు ఆఫ్గనిస్తాన్ ఐసిస్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఉన్నారు. వారిని ఐసిస్ తమ వర్గంలో చేర్చుకుంది. కాగా పాప పుట్టిన సంగతి ఇజాస్ కేరళలోని తమ బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ధ్రువీకరించింది. వారు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో ఆ ప్రాంతాన్ని కచ్చితంగా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఆగస్టులో ఇండియా నుంచే వెళ్లి ఐసిస్ లో చేరిన అస్ఫాక్, అతని భార్యకు కూడా పాప పుట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.