యాప్నగరం

డ్యూటీ ముగిసిందని దిగిపోయిన పైలట్.. బస్సెక్కిన ట్రావెలర్స్!

తన డ్యూటీ సమయం ముగిసిందని చెబుతూ బయలుదేరాల్సిన విమానంలో నుంచి పైలట్ దిగిపోవడంతో ప్రయాణికులను బస్సులో గమ్యస్థానానికి తరలించారు.

TNN 10 Nov 2017, 12:26 pm
తన డ్యూటీ సమయం ముగిసిందని చెబుతూ బయలుదేరాల్సిన విమానంలో నుంచి పైలట్ దిగిపోవడంతో ప్రయాణికులను బస్సులో గమ్యస్థానానికి తరలించారు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్‌కు చెందిన జైపూర్ ఢిల్లీ విమానంలో గురువారం చోటుచోసుకుంది. జైపూర్ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన విమానాన్ని పైలట్ వదిలేసి వెళ్లిపోగా, మరో పైలట్ అందుబాటులో లేకపోవడంతో వారందరినీ బస్సులో తరలించారు. తాను అలసిపోయానని, ఇక విమానం నడపలేనని చెబుతూ పైలట్ వెళ్లిపోగా, 40 మంది ప్రయాణికులను ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా పంపారు.
Samayam Telugu jaipur delhi flight pilot refuses to fly beyond duty hours ome passengers travel by road
డ్యూటీ ముగిసిందని దిగిపోయిన పైలట్.. బస్సెక్కిన ట్రావెలర్స్!


ప్రయాణికులను సంప్రదించిన తర్వాతే బస్సులో పంపించామని, అంగీకరించని వారికి హోటల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, మరి కొంతమందిని శుక్రవారం ఉదయం విమానాల్లో ఖాళీ సీట్లను బట్టి పంపుతున్నామని అధికారులు వెల్లడించారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత ఏ పైలట్ కూడా విధుల్లో కొనసాగేందుకు వీల్లేదని జైపూర్ విమానాశ్రయం డైరెక్టర్ జేఎస్ బల్హారా తెలిపారు. ఈ విమానం చివరి ట్రిప్ జైపూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉండగా, ఢిల్లీ నుంచి వచ్చేసరికే ఆలస్యం అయింది. ఈ పరిస్థితుల్లో పైలట్ తన విధిని కొనసాగేందుకు నిరాకరించాడని తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.