స్వాతంత్య్రం వచ్చి ఇంతకాలమవుతున్నా దళితులు, గిరిజనులపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎన్ని రకాల చట్టాలున్నా వాటి పట్ల భయమే లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారిపై లైంగిక దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా జార్కండ్లోని చక్రధర్ పూర్ పట్టణంలో ఇద్దరు గిరిజన బాలికలపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాళ్ల వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమేనని పోలీసులు చెప్పారు. ఇటీవల జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరై తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న వారిని అటకాయించిన ఆ ఏడుగురు వారిపై లైంగిక దారుణానికి ఒడిగట్టారు. బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదుచేసి ఇద్దరిని అరెస్ట్ చేసారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
గిరిజన బాలికలంటే అంత లోకువా?
స్వాతంత్య్రం వచ్చి ఇంతకాలమవుతున్నా దళితులు, గిరిజనులపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది.
TNN 1 Sep 2016, 6:21 pm